AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్యాంగాన్ని దెబ్బ తీసే బిల్లు.. రాహుల్ ఎటాక్

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీసేదని, ఈ బిల్లును సమర్థించేవారెవరైనా మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారేనని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీన్ని బుధవారం రాజ్యసభకు సమర్పించనున్నారు. అయితే ఇది రాజ్యాంగంలో పొందు పరచిన సెక్యులరిజానికి విరుధ్ధమని పలు ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోక్ […]

రాజ్యాంగాన్ని దెబ్బ తీసే బిల్లు.. రాహుల్ ఎటాక్
Pardhasaradhi Peri
|

Updated on: Dec 10, 2019 | 3:25 PM

Share

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీసేదని, ఈ బిల్లును సమర్థించేవారెవరైనా మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారేనని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీన్ని బుధవారం రాజ్యసభకు సమర్పించనున్నారు. అయితే ఇది రాజ్యాంగంలో పొందు పరచిన సెక్యులరిజానికి విరుధ్ధమని పలు ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోక్ సభలో చివరిక్షణంలో దీనికి శివసేన మద్దతునివ్వడం విశేషం. (కానీ తన అధికార ‘ సామ్నా ‘ పత్రికలో సేన.. ఇది భారత విభజనకు దారి తీస్తుందని హెచ్చరించింది). దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ ఈ బిల్లుకు సపోర్ట్ ప్రకటించిందని సేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) మహారాష్ట్రకు మాత్రమే వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ బిల్లుపై మా పార్టీ మద్దతుకు, మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు ‘ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు-లోక్ సభలో తమ పార్టీ ఈ బిల్లును సమర్థించినప్పటికీ.. ఓటింగ్ సమయంలో అనుకూలంగా ఓటు చేయకపోవచ్ఛునని శివసేన ‘ ట్రబుల్ షూటర్ ‘ సంజయ్ రౌత్ ట్వీట్ చేయడం విశేషం. కాగా- లోక్ సభలో కాంగ్రెస్, శివసేన ఒకే పంథాలో నడవకపో\వడాన్ని బీజేపీ ఓ కంట కనిపెడుతోంది.చివరి క్షణంలో సేన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడం పట్ల పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ హర్షం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?