AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి.. పలువురికి గాయాలు..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శ‌నివారం జరిగిన ఘోర ప్ర‌మాదంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. ఆర్మీ జ‌వాన్ల‌కు సంబంధించిన అంబులెన్స్‌ కేరి సెక్టార్ వ‌ద్ద రోడ్డుప్ర‌మాదానికి గురైందని, ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయినట్లు..

జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి.. పలువురికి గాయాలు..
Accident In J&k's Rajouri
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 29, 2023 | 5:12 PM

జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శ‌నివారం జరిగిన ఘోర ప్ర‌మాదంలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. ఆర్మీ జ‌వాన్ల‌కు సంబంధించిన అంబులెన్స్‌ కేరి సెక్టార్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదానికి గురైందని, ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖకు సమీపంలోని దుంగి గాలా దగ్గరలో ఉన్నప్పుడు,  అంబులెన్స్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని వారు వెల్లడించారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని,  క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందిస్తున్న‌ామని తెలిపారు.

కాగా, గతేడాది డిసెంబ‌ర్‌లో ఆర్మీ జ‌వాన్లతో వెళ్తున్న వాహ‌నం కూడా సిక్కీంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 16 మంది ఆర్మీ జవాన్లు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..