AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరరూప రాక్షసుడు.. రూ.20 పాన్ మసాలా కోసం బాలికను ఏం చేశాడో తెలుసా..?

20 రూపాయల కోసం ఓ యువకుడు బాలికను పొట్టనబెట్టుకున్నాడు.. పాన్ మసాలా తీసుకురావాలని తానిచ్చిన రూ.20తో ఆ బాలిక చిప్స్ కొనుక్కుందన్న ఆగ్రహంతో ఆమెను దారుణంగా హింసించి చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరుగున నివసిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపాడు.

నరరూప రాక్షసుడు.. రూ.20 పాన్ మసాలా కోసం బాలికను ఏం చేశాడో తెలుసా..?
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2023 | 1:16 PM

Share

20 రూపాయల కోసం ఓ యువకుడు బాలికను పొట్టనబెట్టుకున్నాడు.. పాన్ మసాలా తీసుకురావాలని తానిచ్చిన రూ.20తో ఆ బాలిక చిప్స్ కొనుక్కుందన్న ఆగ్రహంతో ఆమెను దారుణంగా హింసించి చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరుగున నివసిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపాడు. పాన్ మసాలా తీసుకురావాలని నిందితుడు ఆమెను పంపించాడు. అయితే, ఆ బాలిక చిప్స్ కొనుక్కుంది. దీంతో ఆ యువకుడు ఆమెను చంపినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అలీఘర్ ప్రాంతంలోని ఒక కాలనీలో నివసిస్తున్న బాలిక మంగళవారం రాత్రి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు.. ఎంత వెతికిన కనిపించకపోవడంతో.. ఆమె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ కెమెరాలలో ఒకదానిలో ఒక అమ్మాయి కనిపించింది. ఇందులో, ఆమె తన పొరుగువారి ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. కానీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. ఈ సమయంలో బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.

దీంతో పోలీసులు బాలిక పక్కింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో నిందితుడు జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పాడు. తానే ఆ బాలికను చంపినట్లు అంగీకరించాడు. బాలికకు రూ.20 ఇచ్చి పాన్ మసాలా కొనేందుకు సమీపంలోని దుకాణానికి పంపినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే అక్కడినుంచి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి చేతిలో పాన్ మసాలా లేదు.. ఆ డబ్బుతో చిప్స్ కొనుక్కున్నట్లు తెలిపాడు. దీంతో బాలికను మందలించానని.. ఆమె తిరిగి గొడవకు దిగిందని.. ఈ సమయంలో మొదట బాలికను కొట్టి, ఆపై గొంతు కోసి చంపినట్లు పోలీసులకు తెలిపాడు.

బాలిక కోసం వెతుకుతున్న పోలీసులు తన ఇంటికి వచ్చినప్పుడు బాలిక మృతదేహాన్ని పారవేయబోతున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నగర ఎస్పీ మృగాంక్ శేఖర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి