AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరరూప రాక్షసుడు.. రూ.20 పాన్ మసాలా కోసం బాలికను ఏం చేశాడో తెలుసా..?

20 రూపాయల కోసం ఓ యువకుడు బాలికను పొట్టనబెట్టుకున్నాడు.. పాన్ మసాలా తీసుకురావాలని తానిచ్చిన రూ.20తో ఆ బాలిక చిప్స్ కొనుక్కుందన్న ఆగ్రహంతో ఆమెను దారుణంగా హింసించి చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరుగున నివసిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపాడు.

నరరూప రాక్షసుడు.. రూ.20 పాన్ మసాలా కోసం బాలికను ఏం చేశాడో తెలుసా..?
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2023 | 1:16 PM

Share

20 రూపాయల కోసం ఓ యువకుడు బాలికను పొట్టనబెట్టుకున్నాడు.. పాన్ మసాలా తీసుకురావాలని తానిచ్చిన రూ.20తో ఆ బాలిక చిప్స్ కొనుక్కుందన్న ఆగ్రహంతో ఆమెను దారుణంగా హింసించి చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరుగున నివసిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపాడు. పాన్ మసాలా తీసుకురావాలని నిందితుడు ఆమెను పంపించాడు. అయితే, ఆ బాలిక చిప్స్ కొనుక్కుంది. దీంతో ఆ యువకుడు ఆమెను చంపినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అలీఘర్ ప్రాంతంలోని ఒక కాలనీలో నివసిస్తున్న బాలిక మంగళవారం రాత్రి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు.. ఎంత వెతికిన కనిపించకపోవడంతో.. ఆమె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ కెమెరాలలో ఒకదానిలో ఒక అమ్మాయి కనిపించింది. ఇందులో, ఆమె తన పొరుగువారి ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. కానీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. ఈ సమయంలో బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.

దీంతో పోలీసులు బాలిక పక్కింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో నిందితుడు జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పాడు. తానే ఆ బాలికను చంపినట్లు అంగీకరించాడు. బాలికకు రూ.20 ఇచ్చి పాన్ మసాలా కొనేందుకు సమీపంలోని దుకాణానికి పంపినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే అక్కడినుంచి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి చేతిలో పాన్ మసాలా లేదు.. ఆ డబ్బుతో చిప్స్ కొనుక్కున్నట్లు తెలిపాడు. దీంతో బాలికను మందలించానని.. ఆమె తిరిగి గొడవకు దిగిందని.. ఈ సమయంలో మొదట బాలికను కొట్టి, ఆపై గొంతు కోసి చంపినట్లు పోలీసులకు తెలిపాడు.

బాలిక కోసం వెతుకుతున్న పోలీసులు తన ఇంటికి వచ్చినప్పుడు బాలిక మృతదేహాన్ని పారవేయబోతున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నగర ఎస్పీ మృగాంక్ శేఖర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!