AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లిద్దరూ కృష్ణార్జునులే.. మోదీ, షాలను పోల్చిన తలైవా..

ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ బీజేపీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయాన్ని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి అమిత్‌షా, రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్య పరిష్కారంలో బీజేపీ విజయవంతమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హోం మంత్రి […]

వాళ్లిద్దరూ కృష్ణార్జునులే.. మోదీ, షాలను పోల్చిన తలైవా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 11, 2019 | 2:00 PM

Share

ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ బీజేపీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయాన్ని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి అమిత్‌షా, రజినీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్య పరిష్కారంలో బీజేపీ విజయవంతమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. అంతేకాదు మోదీ, షాలు కృష్ణార్జునులవంటివారని రజినీకాంత్ అభివర్ణించారు.