AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌లో జాలీ రైడ్.. నటికి గాయాలు..!

కరోనా విస్తరణను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ అందరూ పాటించాలని సెలబ్రిటీలు అందరిలో అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు.

లాక్‌డౌన్‌లో జాలీ రైడ్.. నటికి గాయాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2020 | 6:50 PM

Share

కరోనా విస్తరణను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ అందరూ పాటించాలని సెలబ్రిటీలు అందరిలో అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు. అయితే ఓ నటి మాత్రం.. లాక్‌డౌన్‌ను ఉల్లఘించి తన స్నేహితుడితో కలిసి జాలీ రైడ్‌కు వెళ్లి ప్రమాదం కొని తెచ్చుకుంది. వారు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురి కాగా.. ఈ ఘటనలో ఆమెకు, ఆమె స్నేహితుడికి గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. శాండిల్‌వుడ్‌ నటి షర్మిల మండ్రే తన స్నేహితుడు లోకేష్‌తో కలిసి శనివారం తెల్లవారుజాము సమయంలో జాగ్వార్‌ కారులో జాలీ రైడ్‌కు వెళ్లింది. వసంత్‌నగర్‌లో రైల్వే బ్రిడ్జ్‌ కింద వీరు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు, అతడి కాలికి గాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స నిమిత్తం కున్నిన్‌గమ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హైగ్రౌండ్ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఆమెపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీస్‌ జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతెగౌడ తెలిపారు. మరోవైపు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించడంతో పాటు.. జాలీ రైడ్‌కు వెళ్లడం, ఆసుపత్రి నుంచి పరారీ అవ్వడంతో షర్మిలాపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read This Story Also: భవనంపై నుంచి దూకి.. కరోనా అనుమానితుడు ఆత్మహత్యాయత్నం..!