AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: గ్లోబల్ లీడర్ ఆయనే.. ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు: మార్క్ మోబియస్ కీలక వ్యాఖ్యలు

సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్తానం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది..

PM Modi: గ్లోబల్ లీడర్ ఆయనే.. ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు: మార్క్ మోబియస్ కీలక వ్యాఖ్యలు
PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2024 | 6:06 PM

Share

నరేంద్ర దామోదరదాస్ మోదీ.. ప్రధాని మోదీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్తానం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా.. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉంది.. గ్లోబల్ టాప్ లీడర్లలో ప్రధాని మోదీ ఒకరు.. ఇంకా, జీ20 అయినా.. బ్రిక్స్ అయినా.. కాప్ 29 అయినా.. వేదిక ఏదైనా భారత్ పేరు మారుమోగాల్సిందే.. ఇలా అంతర్జాతీయ వేదికలపై భారత్ పేరు మార్మోగడానికి ప్రధాన కారణం.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే.. ఎవరితోనైనా.. ఏదేశంతోనైనా చర్చలు జరపగల సమర్థ నేతగా ప్రధాని మోదీ ఎదిగారు.. అంతేకాకుండా.. భారత్ నిర్ణయాలను కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీంతోపాటు.. శాంతి సామరస్యాన్ని కొనసాగించేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉందని చాటిచెబుతున్నారు. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ ఓ ఇన్వెస్టర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది..

ప్రపంచ వేదికపై రాజకీయ రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతోనూ చర్చలు జరపగల సమర్థుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని.. ఆయన కృషికి గానూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని ప్రముఖ పెట్టుబడిదారుడు, బియస్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ LLP వ్యవస్థాపకుడు మార్క్ మోబియస్ మంగళవారం పేర్కొన్నారు.

వీడియో చూడండి..

వార్త సంస్థ IANSతో మాట్లాడిన 88 ఏళ్ల మోబియస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోబియస్ మాట్లాడుతూ.. ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నందున, ముఖ్యంగా ప్రస్తుత పశ్చిమాసియా వివాదం, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రధాని మోదీ ముఖ్యమైన శాంతికర్తగా మారగలరని అన్నారు.

“ప్రధాని మోదీ ప్రపంచంలోని గొప్ప నాయకుడు — గొప్ప సంస్కర్త.. అతను చాలా చాలా మంచి వ్యక్తి.. అంతర్జాతీయంగా అతని పాత్ర, శాంతి దిశగా ముందుకు సాగడానికి ప్రాధాన్యత పెరుగుతుందని నేను భావిస్తున్నాను.. ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా.. అన్ని వైపులా సంభాషణలు చేయగలడు.. అతను ముందుకు సాగడానికి చాలా ముఖ్యమైన శాంతికర్తగా మారగలడు” అని మోబియస్ నొక్కిచెప్పారు. ఆయన మొదటి ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్‌కు మార్గదర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందారు..

నోబెల్ శాంతి బహుమతి విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్హుడు.. అంటూ మోబియస్ చెప్పారు. ప్రధాని మోడీ నిజంగా దాదాపు దేనినైనా చేయగలడు.. ఈ ప్రపంచ అవార్డుకు అర్హుడు.. అంటూ పేర్కొన్నారు.

భారతదేశం తటస్థంగా ఉండటానికి, అందరికీ న్యాయం దక్కేందుకు తన సామర్థ్యాన్ని చూపించింది.. దేశం “ప్రపంచ వేదికపై శాంతికి మధ్యవర్తిగా వ్యవహరించడానికి చాలా మంచి స్థితిలో ఉంది” అని మోబియస్ IANS కి చెప్పారు. ప్రధానమంత్రి మోడీ ఈ రోజు ప్రపంచంలో కీలక మధ్యవర్తిగా ఉండటానికి చాలా అర్హత కలిగి ఉన్నారు.. అంటూ ఇన్వెస్టర్ మోబియస్ వివరించారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో తటస్థంగా కనిపించినప్పటికీ.. శాంతియుత పరిష్కారం కోసం పిఎం మోదీ స్థిరంగా వాదించారు.. స్థిరత్వానికి ప్రతిపాదకులుగా భారతదేశం స్థానాన్ని పునరుద్ఘాటించారు. 1992లో దౌత్య సంబంధాల స్థాపన తర్వాత ఒక భారత ప్రధాని ఆగస్టులో ఉక్రెయిన్‌లో ప్రధాని చేసిన మొదటి పర్యటన – యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతంలో శాంతిని పెంపొందించడంలో భారతదేశం చురుకైన పాత్రను పోషించింది..

తనకు – ప్రధాని మోడీకి మధ్య ఉన్న సారూప్యత గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. మోబియస్ IANSతో మాట్లాడుతూ.. తమ మధ్య సాధారణ విషయాలు ఎదురు చూస్తున్నాయని, ఏ విషయంలో మోదీ వెనుకకు చూడటం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో దాని గురించి మోదీ మరింత అవగాహనతో ఉండటం మరింత ఆశాజనకంగా ఉందంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us