మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 300 గుంజీలు తీసిన విద్యార్థి పరిస్థితి విషమం..

ర్యాగింగ్‌కు తన కుమారుడే కాదు, యాభై మందికి పైగా మెడికల్‌ విద్యార్థులు బాధితులుగా ఉన్నారని బాధిత విద్యార్థి తండ్రి ఆరోపించాడు. 40 మంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు కలిసి ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ని ర్యాగింగ్‌ పేరిట వేధించారని అన్నారు. వారిలో కూడా కొందరు ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు.

మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 300 గుంజీలు తీసిన విద్యార్థి పరిస్థితి విషమం..
Medical Students Ragging
Follow us

|

Updated on: Jun 27, 2024 | 10:10 AM

సీనియ‌ర్ల ర్యాగింగ్‌కు ఓ జూనియ‌ర్ విద్యార్థి తీవ్ర అనారోగ్యం పాల‌య్యాడు. ఫ‌స్టియ‌ర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ చేత 300 గుంజిలు తీయించారు సెకండియ‌ర్ విద్యార్థులు. దీంతో బాధిత విద్యార్థి కిడ్నీ ఇన్‌ఫెక్ష‌న్‌తో బారినపడ్డాడు. ఇప్ప‌టికే అత‌నికి నాలుగు సార్లు డ‌యాల‌సిస్ చేయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని దుంగార్పూర్ మెడిక‌ల్ కాలేజీలో ఈ ఏడాది మే 15వ తేదీన చోటుచేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. దీనిపై మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. ఆ కమిటీ విచారణలో కూడా ర్యాగింగ్ ఆరోపణల్లో నిజం ఉందని తేలింది. ఆ కారణంగా ఏడుగురు సెకండ్‌ ఇయర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో, ఏడుగురు విద్యార్థులపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ స్థానిక సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ బాల మార్గుణవేలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ర్యాగింగ్‌ ఘటన నెలన్నర క్రితం మే 15న జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌ని సెకండ్ ఇయర్ స్టూడెంట్ కాలేజీకి దగ్గర్లోని కొండకి పిలిచాడని, అక్కడ అతను మూడు వందల కంటే ఎక్కువ గుంజీలు తీయించారట. దీంతో ఆ విద్యార్థి ఆరోగ్యం క్షీణించింది. విద్యార్థిని కిడ్నీ, కాలేయం దెబ్బతిన్నాయి. విద్యార్థి పరిస్థితి విషమంగా మారటంతో వెంటనే దుంగార్‌పూర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ శారీరక పరిస్థితి మెరుగుపడకపోవడంతో గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.

ర్యాగింగ్‌కు తన కుమారుడే కాదు, యాభై మందికి పైగా మెడికల్‌ విద్యార్థులు బాధితులుగా ఉన్నారని బాధిత విద్యార్థి తండ్రి ఆరోపించాడు. 40 మంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు కలిసి ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ని ర్యాగింగ్‌ పేరిట వేధించారని అన్నారు. వారిలో కూడా కొందరు ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ర్యాగింగ్‌కు గురైన 20 మంది విద్యార్థులు.. దీనిపై మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో