మరో విషాద సంఘటన.. మట్టి కుప్ప కూలి ఇద్దరు బాలికలు మృతి.. తల్లిదండ్రుల రోదన..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 31, 2022 | 8:33 AM

అయితే, బాలికల అరుపులు విన్న స్థానికులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు బాలికలను రక్షించగలిగారు. ఊపిరాడక ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన నలుగురిని

మరో విషాద సంఘటన.. మట్టి కుప్ప కూలి ఇద్దరు బాలికలు మృతి.. తల్లిదండ్రుల రోదన..
death

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భిరా కొత్వాలి పరిధిలోని ధాకియా గ్రామంలో శారదా నది ఒడ్డున వదులుగా ఉన్న మట్టి కుప్ప కూలిపోవడంతో ఇద్దరు బాలికలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను 12 ఏళ్ల పూనమ్ దేవి, 13 ఏళ్ల శివానిగా గుర్తించారు. శిథిలాల కింద కూరుకుపోయిన మరో ముగ్గురు బాలికలు నిక్కీ, నైరా, నైన్సీలను స్థానికులు రక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు భిరా కొత్వాలి ఇన్‌ఛార్జ్ విమల్ కుమార్ గౌతమ్ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఐదుగురు బాలికలు మట్టి సేకరించేందుకు శారదా నదికి వెళ్లారు.

శారదా నది గ్రామంలోని నివాస ప్రాంతం నుండి వంద మీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. ఈ బాలికలందరూ నది ఒడ్డుకు సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంచుకుని మట్టిని తవ్వడం ప్రారంభించిన సమయంలో మట్టి కూలిపోయి ఈ దుర్ఘటన జరిగింది. అకస్మాత్తుగా బురద పడి ఇద్దరు బాలికలు మరణించారు.

అయితే, బాలికల అరుపులు విన్న స్థానికులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు బాలికలను రక్షించగలిగారు. ఊపిరాడక పూనమ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన నలుగురిని వెంటనే బిజువాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. చికిత్స పొందుతూ శివాని కూడా మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu