ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఏడాది చివరి నెల రావడమే ఆలస్యం అన్నట్లుగా అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ప్రత్యేకంగా స్వాగతించాలని కోరుకుంకుంటున్నారా..? అయితే అందుకు ఎక్కడికైనా టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. ఏడాది ముగింపులో టూర్లకు వెళ్లడం వల్ల వచ్చే ఏడాదిని ఉల్లాసంగా ప్రారంభించవచ్చు. ఇంకా మీకు కూడా ఉద్యోగ జీవితానికి కొంత విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుంది.
తద్వారా మీ మనసు కూడా చురుకుగా ఉంటుంది. అలా టూర్ వెళ్లాలనుకుంటే.. ఆహారం నుంచి అందం పోకడల వరకు అనేక అంశాలను గుర్తుంచుకొని ప్లాన్ చేసుకోండి. అలాంటి ప్రదేశాల గురించి మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం. రాబోయే కొత్త సంవత్సరాదిని మంచి ప్రదేశంలో చేసుకోవాలనుకుంటే, 2022 సంవత్సరంలో ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు.
దేశంలోని ప్రతి ఒక్కరూ సందర్శించాలనుకునే ప్రదేశాలలో గోవా తప్పకుండా ఉంటుంది. దేశంలోని ప్రముఖ వెకేషన్ డెస్టినేషన్లలో గోవా మొదటి స్థానంలో ఉండటానికి ఇదే కారణం. అందమైన సముద్ర తీరం ఉన్న ఈ నగరం దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి. మీరు కూడా గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. అగుడా ఫోర్ట్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్తో పాటు పలోలెం బీచ్, దూద్సాగర్ జలపాతం, బాగా బీచ్, అంజునా బీచ్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.
దక్షిణ భారతదేశం ఎల్లప్పుడూ సందర్శించడానికి ప్రత్యేకమైన, అందమైన ప్రదేశం మున్నార్. కేరళలోని చాలా అందమైన ప్రదేశాలలో మున్నార్ కూడా ఒకటి. పలు నివేదికల ప్రకారం చాలా మంది వారి సెలవులను ఈ ప్రదేశంలో గడపడానికి ఇష్టపడుతున్నారట. ఎకో పాయింట్, అటుకాడ్ జలపాతం, ఎరవికులం నేషనల్ పార్క్, టాటా టీ మ్యూజియం, పల్లివాసల్ జలపాతం, రోజ్ గార్డెన్ మరియు కొలుకుమలై టీ ఎస్టేట్ వంటి అనేక ప్రదేశాలు కూడా మున్నార్ లో ఉన్నాయి.
ఇసుక మధ్య ఉన్న ఈ రాష్ట్రం కళ, సంస్కృతి ప్రేమికులకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రయాణికులకు రాచరిక శైలిలో జీవించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశ ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి సందర్శనకు వస్తుంటారు. 2022 సంవత్సరంలో ప్రసిద్ధి చెందని ప్రదేశాలలో రాజస్థాన్ కూడా ఉంది. ఉదయపూర్, జోధ్పూర్, జైసల్మేర్, జైపూర్, బికనీర్ వంటి నగరాలు రాజస్థాన్ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందాయి.
కర్ణాటకలోని కూర్గ్ కూడా 2022 సంవత్సరంలో ప్రసిద్ధి చెందిన వెకేషన్ స్పాట్లలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ నగరం దాని అందం కారణంగా ప్రజలలో చాలా ప్రసిద్ధి. ఎత్తైన పర్వతాలు, తేయాకు తోటలతో చుట్టుముట్టినట్టు ఉన్న కూర్గ్ను హిల్ స్టేషన్గా పిలుస్తారు. మీరు కూర్గ్ వెళ్లాలనుకుంటే.. రాజా సీటు, రాజా సమాధి, అబ్బే జలపాతం, నామ్డ్రోలింగ్ మొనాస్టరీ, హొన్నమన కెరె సరస్సు, మడికేరి కోట, తలకావేరి మొదలైన వాటిని కూడా సందర్శించవచ్చు.
మొత్తం హిమాచల్ ప్రదేశ్ దాని అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, మనాలి ఇక్కడ ప్రసిద్ధి. ఇంకా దేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో మనాలి కూడా ఒకటి. 2022 వెకేషన్ డెస్టినేషన్లో మనాలి పేరు కూడా ఉంది. హిమపాతం సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. జోగిని జలపాతం, మను దేవాలయం, మాల్ రోడ్, హిడింబా దేవి ఆలయం, నెహ్రూ కుండ్ వంటివి మనాలిలో చూడదగిన ప్రసిద్ధ ప్రదేశాలు.