AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Tourism: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌

ఉద్యోగం, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో లైఫ్‌ బిజీగా మారిపోయింది. దీంతో ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్‌ చేసుకునే పరిస్థితి ఉంది. ఇక వారాలకు వారాలు లీవ్స్‌ పెట్టడం కూడా కష్టంతో కూడుకున్న విషయం. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది....

Telangana Tourism: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
Srisailam
Narender Vaitla
|

Updated on: Jul 19, 2024 | 5:34 PM

Share

ఉద్యోగం, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో లైఫ్‌ బిజీగా మారిపోయింది. దీంతో ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్‌ చేసుకునే పరిస్థితి ఉంది. ఇక వారాలకు వారాలు లీవ్స్‌ పెట్టడం కూడా కష్టంతో కూడుకున్న విషయం. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ప్యాకేజీని డైలీ శ్రీశైలం టూర్‌ పేరుతో ఆపరేట్‌ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 1 రాత్రి, 2 పగళ్లు కొనసాగుతుంది. ప్రతీరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండడం విశేషం. ఇంతకీ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంతలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* తొలి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రయాణం మొదలవుతుంది. పర్యాటక భవన్‌ నుంచి తెలంగాణ టూరిజం బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి బషీర్‌బాగ్‌ వెళ్తుతుంది, బషీర్‌బాగ్‌లో ప్రయాణికులు వచ్చిన తర్వాత 9 గంటలకు శ్రీశైలం జర్నీ మొదలవుతుంది.

* మార్గ మధ్యంలోనే భోజనం ఉంటుంది. అనంతరం శ్రీశైలం చేరుకున్న తర్వాత తొలుత. సాక్షి గణపతి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం కొండపైకి చేరుకుంటారు. తర్వాత హోటల్‌లో చెకిన్‌ కావాల్సి ఉంటుంది. రాత్రి బస శ్రీశైలంలోనే ఉంటుది.

* రెండో రోజు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ కాగానే హోటల్‌లో చెక్‌ అవుట్‌ అవుతారు. తర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది.

* ఇందులో భాగంగా పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రో‌ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం.. త‌దిత‌ర ప్రాంతాల‌ను సందర్శించారు. అనంతరం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

టికెట్‌ ధరల విషయానికొస్తే ఏసీ బస్‌ ప్యాకేజీలో పెద్దలకు రూ. 2400, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 1920గా నిర్ణయించారు. ఇక నాన్‌ ఏసీ విషయానికొస్తే పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600గా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్‌, హోటల్‌లో బస వంటివి ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. అయితే ఫుడ్‌, దర్శనం టికెట్లతో పాటు ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్‌, టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!