AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచానికి మరో షాక్ ఇచ్చిన చైనా? ఈసారి ఏం చేసిందో తెలుసా

ప్రపంచ వాణిజ్య రంగంలో చైనా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధమైంది. గతంలో చవకైన ఎలక్ట్రానిక్ వస్తువులతో మొదలుపెట్టి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సోలార్ ప్యానెల్స్‌తో అంతర్జాతీయ మార్కెట్లను శాసించిన డ్రాగన్ దేశం, ఇప్పుడు 'హ్యూమనాయిడ్ రోబోల' తయారీలో గుత్తాధిపత్యం సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీన్నే ఆర్థిక నిపుణులు 'ది నెక్ట్స్ చైనా షాక్'గా అభివర్ణిస్తున్నారు.

ప్రపంచానికి మరో షాక్ ఇచ్చిన చైనా? ఈసారి ఏం చేసిందో తెలుసా
China Humanoid Robot Revolution
Nikhil
|

Updated on: Jun 17, 2026 | 9:40 PM

Share

బీజింగ్ శివార్లలోని ‘లింగీ ఐటెక్’ వంటి ఫ్యాక్టరీలు ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. సర్క్యూట్ బోర్డులను అమర్చడం నుండి క్లిష్టమైన పారిశ్రామిక పనుల వరకు, ఈ రోబోలు మనుషులతో సమానంగా పని చేయగలవు. చైనాలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా, యువత కొరతను దృష్టిలో ఉంచుకుని, తయారీ రంగం, హెల్త్‌కేర్ విభాగాల్లో వీటిని వినియోగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది 20 వేల రోబోలను ఉత్పత్తి చేయాలని భావిస్తున్న చైనా, 2030 నాటికి ఏటా ఏకంగా 20 లక్షల రోబోలను తయారు చేయాలనే భారీ లక్ష్యంతో ఉంది.

ప్రపంచ దేశాలపై ప్రభావం

చైనా సాధిస్తున్న ఈ సాంకేతిక పురోగతి యూరప్ దేశాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈవీలు, సోలార్ ప్యానెల్స్ విషయంలో ఇప్పటికే చైనా ధాటికి చతికిలబడిన యూరప్ సంస్థలు, ఇప్పుడు రోబోటిక్స్ రంగంలోనూ చైనా గుత్తాధిపత్యం సాధిస్తే తమ పరిశ్రమలు కనుమరుగవుతాయని భయపడుతున్నాయి. అయితే, చైనా టెక్నాలజీని పూర్తిగా బహిష్కరిస్తే భవిష్యత్ పరిశ్రమల్లో తాము వెనుకబడిపోతామేమోననే సందిగ్ధంలో ఆ దేశాలు ఉన్నాయి.

భారతదేశానికి సవాళ్లు – వ్యూహాలు

భారతదేశ పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. గత పదేళ్లలో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్స్, మెషీనరీ, లిథియం బ్యాటరీల కోసం భారత్ చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2025 నాటికి ఈ దిగుమతులు 130 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా పెట్టుబడులపై భారత్ గతంలో కఠిన నిబంధనలు విధించినప్పటికీ, ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్స్ తయారీలో భాగంగా కొన్ని సడలింపులు ఇచ్చింది.

జాయింట్ వెంచర్ల ద్వారా చైనా నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలని భారత్ ఆశిస్తోంది. కానీ, కీలకమైన బ్యాటరీ, రోబోటిక్స్ టెక్నాలజీని పంచుకోవడానికి చైనా సిద్ధంగా లేదు. భారత్ బలపడితే భవిష్యత్తులో తమకే నష్టమని డ్రాగన్ దేశం భావిస్తోంది. ఏది ఏమైనా, హ్యూమనాయిడ్ రోబోల తయారీలో చైనా చేస్తున్న ఈ ప్రయోగం రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచ వాణిజ్య సంబంధాలను, పారిశ్రామిక భవితవ్యాన్ని మార్చివేయడం ఖాయం. మనం ఈ సాంకేతిక సవాలును ఎలా ఎదుర్కొంటామన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న!

Follow Us