Saggubiyyam Vadiyalu: ఏడాది పాటు నిల్వ ఉండే రుచికరమైన సగ్గు బియ్యం వడియాల తయారీ తెలుసుకుందాం..!

Saggubiyyam Vadiyalu: వేసవి వచ్చిందంటే చాలు.. తెలుగువారి లోగిళ్ళలో పచ్చళ్ళు, వడియాల సందడి మొదలవుతుంది. ఏడాదికి ఉపయోగపడేలా ఊరగాయలు వడియాలు పెట్టుకుంటారు. ఈరోజు ఆంధ్ర స్పెషల్ సగ్గుబియ్యం వడియాల తయారీ విధానం...

Saggubiyyam Vadiyalu:  ఏడాది పాటు నిల్వ ఉండే రుచికరమైన సగ్గు బియ్యం వడియాల తయారీ తెలుసుకుందాం..!
Saggubiyyam Vadiyalu
Follow us

|

Updated on: Apr 05, 2021 | 5:17 PM

Saggubiyyam Vadiyalu: వేసవి వచ్చిందంటే చాలు.. తెలుగువారి లోగిళ్ళలో పచ్చళ్ళు, వడియాల సందడి మొదలవుతుంది. ఏడాదికి ఉపయోగపడేలా ఊరగాయలు వడియాలు పెట్టుకుంటారు. ఈరోజు ఆంధ్ర స్పెషల్ సగ్గుబియ్యం వడియాల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

సగ్గుబియ్యం వడియాల తయారీకి కావలసిన పదార్ధాలు:

సగ్గు బియ్యం ఎం(లావు సగ్గుబియ్యం) – నాలుగు గ్లాసులు పచ్చి మిరపకాయలు – 15 జీలకర్ర – ముప్పావు స్పూను. ఉప్పు – రుచికి తగినంత. కాచి చల్లార్చిన పాలు – ఒక అర గ్లాసు.

తయారీ విధానము:

సగ్గుబియ్యం వడియాలు పెట్టుకునే ముందు రోజు రాత్రి.. ఒక గిన్నెలో ఆ సగ్గుబియ్యాన్ని ఒక గ్లాస్ కొలత ప్రకారం పోసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. మర్నాడు ఉదయమే.. ఏ కొలత ప్రకారం సగ్గుబియ్యం వేసుకున్నామో.. ఆ గ్లాస్ తీసుకుని.. ఒక గిన్నెలో ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఆరు గ్లాసుల చొప్పున నీరు పోసుకోవాలి. ఆ నీటిని గ్యాస్ స్టౌ మీద పెట్టి.. వేడి చేయాలి. ఇంతలో పచ్చి మిర్చి , ఉప్పు, జీలకర్ర వేసుకుని మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీరు బాగా మరిగించిన తర్వాత పచ్చి మిర్చి పేస్ట్ ను వేసుకుని గరిటతో బాగా కలపాలి. వెంటనే నానబెట్టిన సగ్గు బియ్యం ను కూడా వేసుకుని మంటను మీడియం సెగలో పెట్టుకుని సగ్గు బియ్యం గింజలు బాగా ఉడికించాలి. అలా సగ్గుబియ్యం గింజలు బాగా లావయ్యి బాగా దగ్గర పడి పారదర్శకంగా అంటే గింజలు transparent గా అయ్యే వరకు దగ్గరే ఉండి ఉండకట్టకుండా మరియు అడుగంటకుండా గరిటెతో బాగా కలుపుతుండాలి. సగ్గుబియ్యము బాగా ఉడికి దగ్గర పడ్డాక ఒక అర గ్లాసు కాచి చల్లార్చిన చిక్కని పాలు అందులో పోసి గరిటెతో బాగా కలిపి దింపు కోవాలి. ఇలా పాలు పోస్తే సగ్గు బియ్యం వడియం వేగిన తర్వాత మల్లెపూవులా తెల్లగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత దానిని ఒక పది నిముషాలు చల్లారనివ్వాలి.

కొద్దిగా చల్లారిన తర్వాత ఎండలో కాటన్ బట్టపై ఒక గరిటెతో కాచిన సగ్గుబియ్యాన్ని గుండ్రముగా వడియాలు వీలయినంత పల్చగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వడియాలు ఎండలో రోజూ పెట్టుకోవాలి. అవి వాటంతటఅవే ఊడివస్తాయి. అప్పుడు వాటిని తీసి గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలకు నీరు తగలక పొతే.. ఏడాది పాటు నిల్వ ఉంటాయి.

అవసరమైనప్పుడు కాసిని వడియాలు తీసుకుని నూనెలో వేయించుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడియాలను భోజనములోకి పక్కన ఆదరువుగానే కాదు.. మధ్యాహ్నం స్నాక్స్ గా కూడా తినవచ్చు.

Also Read: లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్లో సంపాదన..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు