AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: మరణం తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?

గరుడ పురాణం మనిషి మరణానంతర జీవితాన్ని వివరంగా చెప్పే పురాణంగా ప్రసిద్ధి చెందింది. ఆత్మ ఎటువంటి దశలు ఎదుర్కొంటుందో, పాపాలు చేసిన వారికి ఏ విధమైన శిక్షలు వస్తాయో ఇందులో వివరంగా ఉంది. ఇది ధర్మాన్ని పాటించేలా మనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తుంది.

Garuda Puranam: మరణం తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?
Garuda Puranam
Prashanthi V
|

Updated on: May 06, 2025 | 2:31 PM

Share

గరుడ పురాణం ఇది మనిషి మరణం తర్వాత ఎలాంటి దశలను ఎదుర్కొంటుందో చెబుతుంది. మనం జీవితంలో చేసే పనుల మీద ఆధారపడి మన ఆత్మకు పుణ్యం లేదా శిక్ష దక్కుతుంది. గరుడ పురాణం చెప్పిన విధంగా మంచి పనులు చేసిన వాళ్లు శాంతిగా ఉంటారు. చెడు పనులు చేసిన వాళ్లు మాత్రం ఎన్నో కఠినమైన శిక్షలు పొందుతారు.

మరణం తర్వాత ఆత్మ అస్వచ్చత స్థితిలో ఉంటుందనేది గరుడ పురాణం చెప్పే మొదటి విషయం. ఈ స్థితిలో ఆత్మ శుద్ధి కోసం గట్టిగా తపస్సు చేయాల్సి వస్తుంది. ఇది బాధతో కూడిన దశగా ఉంటుంది.

పాపాలు చేసిన ఆత్మను యమదూతలు పట్టుకుని యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ ఆత్మకు కఠిన శిక్షలు వేస్తారు. ఈ దశ చాలా భయానకంగా ఉంటుంది.

పాపాలు చేసిన మనిషి ఆత్మను నేరుగా అగ్నిలో వేస్తారు. ఇది ఆత్మకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని కాల్చే ఈ శిక్ష చాలా భయంకరమైనదిగా వర్ణించబడింది.

ఆత్మను ఎముకల మధ్య వేలాడదీస్తారు. దీని వల్ల శరీరం విరిగిపోతూ తీరని నొప్పిని కలిగిస్తుంది. ఇది శారీరకంగా కాక మానసికంగా కూడా బాధను కలిగించే దశ.

పాపాలు చేసిన మనిషి ఆత్మను వేడి లోహ పాత్రలో వేస్తారు. ఇది కాల్చే బాధను మించిన కష్టాన్ని కలిగిస్తుంది. ఇది శిక్షలలో ఒకటి.

సింహాసనంపై కూర్చోబెట్టడం.. ఇది వినడానికి అద్భుతంగా అనిపించొచ్చు.. కానీ ఇది శిక్ష. ఈ సింహాసనంలో కూర్చోబెట్టి ఆత్మకు మానసిక బాధను కలిగిస్తారు. శారీరకంగా కూడా బాధను అనుభవించాల్సి వస్తుంది.

ఆత్మను ముళ్లతో గుచ్చుతారు. ఇది రక్తాన్ని కారించే స్థితికి చేరుతుంది. ఈ సమయంలో బాధకు అంతం అనేదే ఉండదు.

ఆత్మను మండే నీటిలో ముంచుతారు. ఇది మరింత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. శరీరం తట్టుకోలేనంతగా కాలిపోతుంది.

పాపాలు చేసిన మనిషి ఆత్మను వాంతితో కలిపిన అగ్నిలో వేస్తారు. ఇది శాశ్వతంగా ఆత్మను నాశనం చేస్తుంది. ఇది చాలా దారుణమైన శిక్షగా గరుడ పురాణం చెబుతుంది.

ఆత్మను చీకటి గుహలలో వదిలేస్తారు. అక్కడ శాంతి ఉండదు. బాధ మాత్రం ఎప్పటికీ ఆగదు. ఇది నిరంతరం కష్టాన్ని కలిగించే స్థితి.

ఈ శిక్షలు అన్నీ పాపాల కారణంగా ఎదురయ్యే దశలు. కానీ మంచి పనులు చేసిన వారికి ఇవేవీ జరగవు. కనుక మనం జీవితంలో మంచి మార్గంలో నడవాలి. ధర్మం పాటిస్తే ఆత్మ శాంతిని పొందుతుంది అని గరుడ పురాణం మనకు బోధిస్తుంది.

Follow Us
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!