
వేసవి కాలంలో రోహిణీ కార్తె మొదలైతే రొకళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు తీవ్రమైన ఎండలు మండే కాలంగా పరిగణిస్తారు. తెల్లవారి 7 గంటల నుండే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తాడు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. ఈ తీవ్రమైన వేడి వల్ల ఇళ్లపై ఉండే కాంక్రీట్ స్లాబ్లు (మిద్దెలు) పగటిపూట వేడిని భారీగా పీల్చుకుంటాయి. ఆ వేడి రాత్రి వేళల్లో ఇళ్ల లోపలికి ప్రసరించి ఉక్కపోతను పెంచుతుంది. అయితే, కొన్ని సులువైన, ఖర్చు లేని దేశీ చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంటి పైకప్పును, గదులను ఏసీ లేకుండానే చల్లగా మార్చుకోవచ్చు. ఆ 4 అద్భుతమైన చిట్కాలు ఇవే.
వైట్ రిఫ్లెక్టివ్ పెయింట్ లేదా సున్నం కోటింగ్: ఇంటి పైకప్పును చల్లగా ఉంచడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. మిద్దెపై తెల్లటి రిఫ్లెక్టివ్ పెయింట్ (Cool Roof Paint) లేదా సాధారణ సున్నాన్ని (Lime) పూయాలి. తెలుపు రంగు సూర్యకిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం (Reflect) చేస్తుంది. దీనివల్ల కాంక్రీట్ స్లాబ్ వేడెక్కదు మరియు ఇంటి లోపలి ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది.
పైకప్పుపై గడ్డి లేదా వైకోలు పరచడం: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వాడే సహజ సిద్ధమైన పద్ధతి ఇది. మిద్దెపై మందపాటి ఎండుగడ్డి, తాటి ఆకులు లేదా వైకోలును పరచాలి. దీనిపై రోజుకు రెండుసార్లు నీరు చల్లుతుంటే, అది సూర్యుడి వేడి నేరుగా సిమెంట్ స్లాబ్కు తగలకుండా ఒక బలమైన కవచంలా (Insulator) పనిచేస్తుంది.
టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడం (మొక్కలు పెంచడం): ఇంటి పైకప్పుపై వీలైనన్ని ఎక్కువ మొక్కల కుండీలను చేర్చండి. కుండీలలోని తడి మట్టి, మొక్కల ఆకులు సూర్యరశ్మిని పీల్చుకుని, ఆ ప్రాంతంలో తేమను (Moisture) పెంచుతాయి. ఈ టెర్రస్ గార్డెన్ ఇళ్లను చల్లగా ఉంచడమే కాకుండా, ఇంటికి అందాన్ని, పచ్చదనాన్ని ఇస్తుంది.
సాయంత్రం వేళల్లో నీటిని చల్లడం (హైడ్రేషన్): రోజంతా ఎండకు కాలిన పైకప్పుపై సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పైపుతో నీటిని చల్లాలి. వేడి స్లాబ్పై నీరు పడినప్పుడు అది ఆవిరిగా మారి, పైకప్పులోని వేడినంతటినీ లాగేస్తుంది. ఈ చిన్న పని వల్ల రాత్రి వేళల్లో గదులు చాలా చల్లగా మారి ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తాయి. ఈ నాలుగు చిట్కాలను పాటించడం ద్వారా తీవ్రమైన రోహిణీ కార్తె ఎండల నుండి మీ ఇళ్లను కాపాడుకోవడమే కాకుండా, కరెంట్ బిల్లులను కూడా భారీగా ఆదా చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..