మహిళలు, చిన్నారుల కోసం ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’కు శ్రీకారం.!
సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెప్టెంబర్ 1వ తేదీన 'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' పధకాన్ని ప్రారంభించనున్నారు.
సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెప్టెంబర్ 1వ తేదీన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనురాధ వెల్లడించారు. 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్ పధకాన్ని అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో రక్త హీనతను నివారించేందుకు ఈ పధకం ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ పధకం ద్వారా సుమారు 30 లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తామన్నారు. దీని కోసం రూ.1863 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ నుంచి ఇంటికే రేషన్ డెలివరీ చేస్తామన్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-ప్రైమరీ విద్యను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు అనురాధ తెలిపారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కి..