AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఎస్ వివేకా హత్య కేసు: ఎర్ర గంగిరెడ్డికి నార్కో పరీక్షలు

మాజీ ఎంపీ, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న హత్య కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నార్కో టెస్ట్‌ చేసేందుకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో ఈ రాత్రి హైదరాబాద్‌కు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. కాగా ప్రస్తుతం ఎర్ర గంగిరెడ్డి పోలీసుల అదుపులో ఉండగా.. ఆయనను డీఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. కాగా వివేకా మరణం తరువాత సాక్ష్యాలను మాయం చేశారన్న ఆరోపణలతో ఎర్ర గంగిరెడ్డిని […]

వైఎస్ వివేకా హత్య కేసు: ఎర్ర గంగిరెడ్డికి నార్కో పరీక్షలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2019 | 4:48 PM

Share

మాజీ ఎంపీ, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న హత్య కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నార్కో టెస్ట్‌ చేసేందుకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో ఈ రాత్రి హైదరాబాద్‌కు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. కాగా ప్రస్తుతం ఎర్ర గంగిరెడ్డి పోలీసుల అదుపులో ఉండగా.. ఆయనను డీఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. కాగా వివేకా మరణం తరువాత సాక్ష్యాలను మాయం చేశారన్న ఆరోపణలతో ఎర్ర గంగిరెడ్డిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.