AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత బాక్సర్లు అదరగొట్టారు…

సుదీర్ఘ విరామం తర్వాత రింగులోకి దిగిన భారత బాక్సర్లు అదరగొట్టారు. ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన అలెక్సిస్‌ వాస్టిన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ‌ 52 కేజీల విభాగంలో అమిత్‌ పంఘాల్, 91 కేజీల విభాగంలో సంజీత్‌ , 75 కేజీల విభాగంలో ఆశిష్‌ కుమార్‌ బంగారు పతకాలతో మెరిశారు.

భారత బాక్సర్లు అదరగొట్టారు...
Sanjay Kasula
|

Updated on: Nov 01, 2020 | 11:13 PM

Share

సుదీర్ఘ విరామం తర్వాత రింగులోకి దిగిన భారత బాక్సర్లు అదరగొట్టారు. ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన అలెక్సిస్‌ వాస్టిన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ‌ 52 కేజీల విభాగంలో అమిత్‌ పంఘాల్, 91 కేజీల విభాగంలో సంజీత్‌ , 75 కేజీల విభాగంలో ఆశిష్‌ కుమార్‌ బంగారు పతకాలతో మెరిశారు.

ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరుల్లో అమిత్‌ 3–0తో అమెరికా బాక్సర్లు రెనె అబ్రహం, సోహెబ్‌ బౌఫియాపై సంజీత్‌ గెలుపొందారు. 75 కేజీల విభాగంలో అమెరికా బాక్సర్ జోసెఫ్‌ జెరోమ్‌ హిక్స్‌ తో ఆశిష్‌ కుమార్‌ తలపడాల్సి ఉండగా… గాయం కారణంగా జోసెఫ్‌ వైదొలిగాడు.

అయితే 57 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్‌ బౌట్‌లో కవీందర్‌ సింగ్‌ బిష్త్‌ 1–2తో  ఫ్రాన్స్‌  బాక్సర్ సామ్యుల్‌ కిష్టోరి చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత బాక్సర్లలో శివ థాపా , సుమీత్‌ సంగ్వాన్‌ , సతీశ్‌ కుమార్‌ కాంస్య పతకాలు సాధించారు.