పవన్ కల్యాణ్‌పైనే సముద్రమంత ఆశ… ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని …!

ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు... చూపించని టీవీ లేదు... వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు... బట్ ఏం లాభం... ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.

పవన్ కల్యాణ్‌పైనే సముద్రమంత ఆశ... ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని ...!
Uppada the sinking village
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jul 15, 2024 | 1:13 PM

8 గ్రామాలు…1365 ఎకరాలు.. నిన్న మొన్నటి వరకు కళ్ల ముందే కనిపించేవి. కానీ ఇవాళ లేవు. ఇప్పుడున్న ఊళ్లు రేపు ఉంటాయో.. లేదో కూడా అనుమానమే. ప్రభుత్వాలు చేస్తున్న అరకొర ప్రయత్నాలు.. అసంపూర్ణ ఆలోచనలు.. ఆ ఊళ్లను.. ఊళ్లోని జనాలను, వారి ఆస్తుల్ని  ఇప్పటి వరకు ఏ మాత్రం ఆదుకోలేకపోయాయి. సముద్రపు అలల ధాటికి ఊళ్లు కొట్టుకుపోతుంటే .. ఆ జనం కన్నీళ్లు కూడా అందులో కలిసిపోతున్నాయి. వారి ఘోష… సముద్రపు ఘోషలో కలిసిపోయి… ఇన్నాళ్లూ పాలకులకు వినిపించకుండా పోయింది.

ఎస్.. మనం మాట్లాడుకుంటున్న ఊరు ఉప్పాడ.

శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

ఎలా ఉండాలి..? ఎలా ఉంది..?

ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు… చూపించని టీవీ లేదు… వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు… బట్ ఏం లాభం… ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు.

అందమైన చీరలపై అలవోకగా జాంధానీ డిజైన్లు అద్దే చేతులు… ఓ వైపు మనోహరమైన సముద్రపు అలల సవ్వడి… ఎటు చూసినా పచ్చదనం… నిజానికి ఆ ఊరి దృశ్యాలు ప్రకృతి గీసిన చిత్రంలా ఉండాలి. ఒకప్పుడు ఉండేది కూడా. కానీ గడిచిన 6 దశాబ్దాలుగా వారి రాత రోజు రోజుకీ మారిపోతోంది. ఎగసి పడే ప్రతి అల.. తమను, తమ ఇళ్లను, తమ ఊరిని మింగేస్తుంటే… తమ బాధ ప్రభుత్వాల ముందు కంఠ శోషగానే మిగిలిపోతూ ఉంటే.. దిక్కు తోచక.. ఆ అలలకు దూరంగా పరిగెడుతునే ఉన్నారు. కానీ విచిత్రమేంటే.. వాళ్లెంత వేగంగా పరిగెడుతుంటే.. ఆ సంద్రం అలలు కూడా అంతే వేగంగా వారిని వెంటబడుతున్నాయి. అలాగని ఊరొదొలి వెళ్లేంత ధైర్యం ఆ జనాలకు లేదు. అదే ఇప్పుడు ఈ తీరానికి లోకువయ్యింది.

సముద్రం చొచ్చుకు వస్తున్న కొద్దీ తాము వెనక్కి జరగడమే తప్ప మరో దారి లేకపోవడంతో మత్స్యకారులంతా ఆందోళనలో ఉన్నారు. దశాబ్ధిన్నర కిందట, కోత నివారణ కోసం నిర్మించిన జియో ట్యూబ్ కూడా ధ్వంసమయ్యింది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Uppada

Uppada

సముద్రం కూల్చేస్తున్న ఊరు

పైన చూస్తున్న చిత్రంలో కూలిపోయిన ఇళ్లు కావవి. పక్కనే కనిపిస్తున్న ఆ సమద్రం కూల్చేసిన ఇళ్లు. ఇప్పటి వరకు 6కి పైగా ఆలయాలు, 3 పాఠశాలలు, రెండు ట్రావెలర్ బంగ్లాలను సముద్రం తనలో కలిపేసుకుంది. ఇక ఇళ్ల లెక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అలల ధాటికి కూలిపోయినవి ఇళ్లు కావు.. ఈ ఊరి జనం జీవితాలు. వానికి 20 ఏళ్ల క్రితం సముద్రానికి వంద మీటర్ల దూరంలో ఇళ్లు కట్టుకున్న వారికి కూడా ఇప్పుడు తమ ఇళ్లు నిలబడతాయనే ధీమా లేదు. ఇప్పటికే కొన్ని సముద్రం పాలయ్యాయి కూడా.

2011 జనాభా లెక్కల ప్రకారమే 12వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. 3,190 ఇళ్లుండేవి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసి పోయిందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

కాకినాడ పోర్ట్ నుంచి సుమారు 12 కి.మీ. దూరంలో ఉన్న ఉప్పాడ మధ్య తీరం చాలాకాలంగా కోతకు గురవుతోంది. దాని కారణంగా బీచ్ రోడ్డు కూడా అనేకమార్లు దెబ్బతింది. పదే పదే రోడ్లు నిర్మించాల్సి వస్తోంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇది... ఉప్పాడ పరిస్థితి

ఇది… ఉప్పాడ పరిస్థితి

ఆనవాళ్లు కనపించని జియో ట్యూబు!

సముద్రతీరాన్ని కోత నుంచి కాపాడేందుకంటూ జియో ట్యూబ్ పేరుతో ఏర్పాట్లు చేశారు. భారీ బండరాళ్లను సముద్రపు ఒడ్డున వేసి కెరటాల తాకిడి తీరాన్ని తాకకుండా అడ్డుకట్టగా మార్చారు. ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని రాళ్లను పెద్ద వలల్లో వేసి అవి అలల తీవ్రతను నివారించేలా ఏర్పాట్లు చేశారు.

నేటికీ బీచ్ రోడ్డులో వేసిన పెద్ద రాళ్లే కోత వేగవంతం కాకుండా నివారించేందుకు దోహదపడుతున్నాయి. కానీ ఉప్పాడ గ్రామాన్ని ఆనుకుని వేసిన ట్యూబ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆనవాళ్లు కూడా మిగలలేదు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నీటి పారుదల శాఖ నిధులతో ఉప్పాడ గ్రామంలో తీవ్రతను అడ్డుకునేందుకు ఆ జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. అప్పట్లో రూ. 12.6 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేశారు. వాటి ఫలితంగా కొంతకాలం పాటు సముద్రపు కోత నివారణ జరిగింది. తాత్కాలికంగా ఫలితాన్నిచ్చిన ట్యూబ్ ఇప్పుడు ఆనవాళ్లే లేకుండా పోయింది. మొత్తంగా తీరంలో సుమారు 1463 మీటర్ల మేర జియో సింథటిక్ ట్యూబులు, బ్యాగులు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్మించారు. ఇది ప్రయోగాత్మక ప్రాజెక్టే అయినప్పటికీ తర్వాత దీన్ని మొత్తం ఉప్పాడ గ్రామంలోని తీరమంతటికీ విస్తరించాలన్నది అప్పటి ఆలోచన. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు కోసం 135 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే ఆనవాలు లేకుండా పోయేసరికి… మిగిలిన బడ్జెట్ కేటాయించి.. ఆ ప్రాజెక్టు పూర్తి చేసేంత ధైర్యం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చెయ్యలేదు.

ఉప్పాడ తీరం వద్ద టీవీ9 ప్రతినిధి సత్య

కోతకు గురైన ఉప్పాడ తీరం వద్ద టీవీ9 ప్రతినిధి సత్య

నిజానికి మొదట్లో ఆ జియోట్యూబులు కొంత మేర ఫలితాన్నిచ్చాయి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఏటా సుమారు 1.98 మీటర్ల నుంచి 7.98 మీటర్ల మేర కోతకు గురయ్యే తీర ప్రాంతం.. జియో ట్యూబులు ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 6 మీటర్లకు పరిమితం అయ్యింది. కానీ 2014-15 నాటికి మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి. 2016లో వచ్చిన వర్ధా తుపాను ధాటికి కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన జియో ట్యూబులు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన ఫని తుపాను దెబ్బకు సముద్రానికి అడ్డంగా కట్టిన రక్షణ గోడలు బలహీనపడ్డాయి.

ఉప్పాడ

ఉప్పాడ

అయితే దేశంలో ఇతర తీర ప్రాంతాల్లో కూడా ఈ జియో ట్యూబుల ప్రయోగం పెద్దగా ఫలితాన్నివ్వలేదన్న విషయం తర్వాత పరిశోధనల్లో వెల్లడయ్యింది.  పశ్చిమ బెంగాల్లోని శంకరపూర్, మహారాష్ట్రలోని దేవ్‌బగ్ అలాగే ధను ప్రాంతాల్లోనూ, గుజరాత్‌లోని అదానీ పోర్టులో, గోవాలోని కండోలిమ్ బీచ్‌లో జియో ట్యూబులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి వల్ల పెద్దగా చెప్పుకోదగ్గ ఫలితాలు లేవు. బలమైన సముద్రపు అలల తాకిడికి అవి తాళలేవన్న విషయం కేవలం ఉప్పాడలోనే కాదు, దేశ వ్యాప్తంగా చేపట్టిన చాలా ప్రయోగాల్లో తేలింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని పరిశీలించారు. తీర ప్రాంతం పదే పదే మునకకు గురికావడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటానని హామీ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం హామీ

డిప్యూటీ సీఎం హామీ

మీకు నేనున్నా…

“ఉప్పాడ ప్రాంతాన్ని వెళ్లి చూసొచ్చా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ విషయమై మాట్లాడాను. సరిగ్గా 18 నెలల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా. దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ పరిసర ప్రాంతాలకు భవిష్యత్తులో ఆ సమస్య ఇక రానివ్వను. కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వరకు అందమైన కోస్టల్ రోడ్‌ను నిర్మిస్తా. అలాగే ఆ ప్రాంతంలో పర్యటకంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తా.” ఇవి ఆయన ఉప్పాడలో 2024 జూలై 3న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇచ్చిన హామీలు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై స్థానికులు చాలా నమ్మకం పెట్టుకున్నట్టు వారి మాటల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉప్పాడ గ్రామం సముద్రంలో కలిసిపోతూ ఉన్నా… ఏ ప్రభుత్వమూ తమకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదని, నిత్యం సముద్రపు కోతకు గురయ్యే రోడ్డు బాగు పడితే చుట్టు పక్కల ఊళ్లలో ప్రజల జీవితాలు మారిపోతాయని స్థానికులు చెబుతున్నారు.

వైజాగ్ బీచ్‌లా మారుతుందా?

వైజాగ్ బీచ్‌లా మారుతుందా?

“నిత్యం సముద్రపు కోతకు గురయ్యే ఈ రోడ్డు బాగుపడితే మా జీవితాలు బాగుపడతాయి. మా జీవనోపాధికి ఈ రోడ్డే ముఖ్యం. నిజంగా ఈ కోస్టల్ రోడ్ ఏర్పాటై.. పర్యటకంగా అభివృద్ధి చెందితే.. వైజాగ్‌లా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.” అన్నది స్థానిక ఆటో డ్రైవర్ మాట.

మా నమ్మకం నువ్వేనయ్యా!

అయితే అధికారంలోకొచ్చే ప్రతి ప్రభుత్వమూ ఇదే తీరున హామీలిస్తూ వచ్చిందని,  అయితే ఏ ఒక్కరూ తమ సమస్యను పూర్తిగా తీర్చలేకపోయారన్నది మరి కొందరు స్థానికుల వాదన. అయితే ఈ సారి మాత్రం ప్రభుత్వంపై నమ్మకం వారి మాటల్లో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన హామీలను కచ్చితంగా వెరవేరుస్తారన్న నమ్మకం తమకు ఉందని అంటున్నారు .

మా నమ్మకం నువ్వేనయ్యా!

మా నమ్మకం నువ్వేనయ్యా!

దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం కల్గిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సుమారు 947 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించింది. 1990 నుంచి 2021 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 289.36 కిలోమీటర్ల మేర తీర్ ప్రాంతం కోతకు గురయ్యందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ NCCR పరిశోధనలో తేలింది. కేవలం ఉప్పాడలోనే ఏటా 1.23 మీటర్ల మేర సముద్రం కోతకు గురవుతూ వస్తోంది. ఇప్పటి వరకు కాకినాడ తీర ప్రాంతంలో సుమారు 600 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇదీ సంగతి!

ఇదీ సంగతి!

ఏమిటి పరిష్కారం?

మానవుడు నిర్మించే కృత్రిమ నిర్మాణాలేవీ సముద్రపు కోత నుంచి తప్పించలేవని, కేవలం సహజసిద్ధంగా ఏర్పాట్లు మాత్రమే తప్పిస్తాయన్నది నిపుణుల మాట. ఎక్కడెక్కడయితే తీరం కోతకు గురవుతుందో ఆయా ప్రాంతాలలో సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారానే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.  ముఖ్యంగా మడ అడవుల పెంపకం అందుకు చక్కని పరిష్కారం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.

కోతకు గురవుతున్న ప్రాంతాలు

కోతకు గురవుతున్న ప్రాంతాలు

ఇండోనేషియా, కెన్యా, పాపువా న్యూ గినియా, కాంబోడియా, నైజీరియా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఈ తరహా ప్రయోగాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్నాయి. మన దేశంలో కర్నాటకలో కూడా  సుమారు 300 ఎకరాల్లో మడ అడవుల్ని పెంచడం ద్వారా సముద్రపు కోతను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మడ అడవులు కేవలం సముద్రపు కోత నుంచి తీర ప్రాంతాలను రక్షించడం మాత్రమే కాదు ఉప్పెనలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా కాపాడతాయి. అనేక వందల జీవరాశులకు ఆశ్రయం ఇస్తాయి కూడా. మరి ఏపీ ప్రభుత్వం ఉప్పాడ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని స్థానిక ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు.  తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నారు.

Edited By Ravi Kumar Panangipalli

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? షాకింగ్ విషయాలు ఏంటంటే..?
వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? షాకింగ్ విషయాలు ఏంటంటే..?
నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు..వెలుగులోకి
నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు..వెలుగులోకి
క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా?
క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా?
అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా పెంపుడు కుక్క..
అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా పెంపుడు కుక్క..
ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే భక్తులకు లగేజీ భారం తప్పదా..!
ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే భక్తులకు లగేజీ భారం తప్పదా..!
టీ20ల్లో విరాట్, రోహిత్, జడేజాలను భర్తీ చేయగల ముగ్గురు
టీ20ల్లో విరాట్, రోహిత్, జడేజాలను భర్తీ చేయగల ముగ్గురు
దీన స్థితిలో అక్షయ్ కుమార్! సమోసా,ఛాయ్ ఫ్రీ అన్నా కూడా నో యూజ్
దీన స్థితిలో అక్షయ్ కుమార్! సమోసా,ఛాయ్ ఫ్రీ అన్నా కూడా నో యూజ్
Girl Mystery: మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు..
Girl Mystery: మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు..
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై