AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా గంజాయి పట్టివేత..!

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం.

భారీగా గంజాయి పట్టివేత..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 5:30 PM

Share

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తమిళనాడుకు లారీలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం గంజాయిని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.