AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్రాన్ కు రాజ్‌నాథ్ బంపరాఫర్!

పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పాకిస్థాన్ తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు. లేదంటే ఆ దేశం ముక్కలుగా విడిపోవాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం హరియాణాలో కర్నల్‌ జిల్లాలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘నేను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. మీరు నిజంగానే ఉగ్రవాదంపై పోరాడేందుకు […]

ఇమ్రాన్ కు రాజ్‌నాథ్ బంపరాఫర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 14, 2019 | 1:12 PM

Share

పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పాకిస్థాన్ తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు. లేదంటే ఆ దేశం ముక్కలుగా విడిపోవాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం హరియాణాలో కర్నల్‌ జిల్లాలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

‘నేను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. మీరు నిజంగానే ఉగ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమంటే మీకు మేము సహకరించేందుకు ముందుంటాం. ఒకవేళ మా సైనిక సహకారం కోరుకున్నా మేము వారిని పాకిస్థాన్‌ పంపించేందుకు సిద్ధమే’ అని అన్నారు. ఇప్పటికీ ఇమ్రాన్‌ పదేపదే కశ్మీర్‌ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మరచిపోవాలని, మీరు ఎంత ఆలోచించినా ఏం జరగదన్నారు. మాపై ఎవరూ ఒత్తిడి తెచ్చినా తలొగ్గేది లేదని అన్నారు. 1947లో మీరు భారత్‌ను రెండుగా విడగొట్టారు. ఆ తర్వాత 1971లో మీ దేశం రెండు ముక్కలైంది. ఇప్పుడు మళ్లీ సందర్భం వస్తే మీ దేశం విడిపోయే పరిణామాలను ఏ శక్తీ ఆపలేదని తెలిపారు.