AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై బస్సులో మంటలు.. కాలిబూడిదైన వోల్వో బస్సు.. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ వద్ద ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఓల్వో బస్సు దగ్ధమైంది.

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై బస్సులో మంటలు.. కాలిబూడిదైన  వోల్వో బస్సు.. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు
Balaraju Goud
|

Updated on: Dec 13, 2020 | 1:03 AM

Share

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ వద్ద ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ఓల్వో బస్సు దగ్ధమైంది. తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓల్వో బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చూస్తుండగానే దావానంలా మంటలు వ్యాపించడంతో గమనించిన డ్రైవర్ బస్సులోంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.