ఐపీఎల్ నిర్వహించేందుకు మేం రెడీ..!
భారత్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఇక్కడ జరగాల్సిన చాలా టోర్నీలు వాయిదా పడుతున్నాయి. ఈ జాబితాలో ఐపీఎల్ కూడా కలిసి పోయింది. వైరస్ కేసులు అధికం...
Venues Ready For IPL 2020 : భారత్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఇక్కడ జరగాల్సిన చాలా టోర్నీలు వాయిదా పడుతున్నాయి. ఈ జాబితాలో ఐపీఎల్ కూడా కలిసి పోయింది. వైరస్ కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహన సందిగ్ధంలో పడింది. అయితే ఆ టోర్నీని దుబాయ్లో నిర్వహిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీలైతే ఐపీఎల్ను విదేశాల్లోనూ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదే అంశంపై దుబాయ్ స్పోర్స్ సిటీ హెడ్ సల్మాన్ హనిఫ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఐపీఎల్ను దుబాయ్లో నిర్వహించాలనుకుంటే, తాము రెడీగా ఉన్నట్లు తెలిపారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని సదుపాయాలను రెడీగా ఉంచినట్లు చెప్పారు. తమ స్టేడియంలో తొమ్మిది పిచ్లు ఉన్నాయని, ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్లు నిర్వహించినా ఎటువంటి నష్టం ఉండదని హనీఫ్ తెలిపారు. పిచ్ కోసం మ్యాచ్లను షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఐసీస అకాడమీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయన్నారు.
అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉన్నది. దానిపై వచ్చే వారం క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆ వరల్డ్ కప్ రద్దు అయితే, అప్పుడు ఐపీఎల్ ఎడిషన్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హనీఫ్ స్పందిస్తూ.. తాము ఆ టోర్నీ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.