కార్లు,మోటారుసైకిళ్ల నెంబర్ ప్లేట్లపై సామాజిక వర్గాల స్టిక్కర్లు ఉంటే వేటు పడుద్ది..యూపీ సర్కార్ కీలక నిర్ణయం
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక వర్గాల పేరుతో వాహనాలపై స్టిక్కర్లు అంటించడాన్ని యోగీ సర్కార్ నిషేదం విధించింది...
Stickers on Vehicles : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక వర్గాల పేరుతో వాహనాలపై స్టిక్కర్లు అంటించడాన్ని యోగీ సర్కార్ నిషేదం విధించింది. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడినవారి వాహనాలు వెంటనే సీజ్ చేస్తామంటూ యూపీ పోలీస్శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాహనాల నెంబర్ ప్లేట్లపై తమ సామాజిక వర్గం పేరుతో స్టిక్కలు, పోస్టర్లు అంటించడంతో వాహనం నెంబర్ కనిపించకుండా పోతోంది. దీంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా వారు ప్రయాణించే వాహనాల విండో అద్దాలపై అతికించి తిరుగుతున్నారు. ( stickers on vehicles)
సమాజంలో ఈ తరహా ధోరణి చెడు సంస్కృతికి ఊతమిచ్చేలా ఉందని హర్షల్ ప్రభు అనే ఒక ఉపాధ్యాయుడు ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకుకు ఓ లేఖ రాశారు. అందులో ఇలాంటి పద్దతి వల్ల భారతీయ సర్వ సమానత్వ విధానానికి ఈ చర్యలు విఘాతం కలిగించే ప్రమాధం ఉందని హెచ్చరించారు. దీనిపై స్పందించిన పీఎమ్వో ఇలాంటి ధోరణి ఉపేక్షించరాదని రవాణాశాఖను ఆదేశించింది. దీంతో వారు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అలాంటి స్టిక్కర్లను తొలగించారు. ఇకపై అటువంటి స్టిక్కర్లు వాహనాలపై అంటిస్తే సీజ్ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.