AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం రెడీ, డిసెంబరు 3 న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో చర్చలకు  కేంద్రం  సుముఖత వ్యక్తం చేసింది. సహనంతో ఉండాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.

రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం రెడీ, డిసెంబరు 3 న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 27, 2020 | 1:07 PM

Share

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో చర్చలకు  కేంద్రం  సుముఖత వ్యక్తం చేసింది. సహనంతో ఉండాలని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. డిసెంబరు 3 న వివిధ రైతు సంఘాల ప్రతిధులతో చర్చలు జరుపుతామని ఆయన ప్రకటించారు. గతంలో కూడా తాము సంప్రదింపులు జరిపామని, ఇంకా ఇందుకు రెడీగా ఉన్నామని ఆయన చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన అన్నారు.  వీరి సమస్యలను తమ రాజకీయ ప్రయోజనాలకు కాంగ్రెస్ సహా విపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని తోమర్ ఆరోపించారు. కాగా ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖ 32 రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.ఇలా ఉండగా రైతు చట్టాలను పార్లమెంటు ఆమోదించిన అనంతరం కూడా వివిద రైతు సంఘాలు వీటిని నిరసిస్తూ ఆందోళనకు దిగగా అప్పుడు కూడా వీరిని కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. వీరు వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయానికి చేరుకోగా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చల్లో పాల్గొనకుండా గైర్ హాజరయ్యారు. తమ శాఖ కార్యదర్శి చర్చలు జరుపుతారని ప్రకటించారు. అయితే రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహించి..స్వయంగా మంత్రే రావాలంటూ డిమాండ్ చేసిన విషయం గమనార్హం. ఆ కార్యాలయంలోనే వారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెనక్కి మళ్లారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తరాదని అన్నదాతలు అంటున్నారు. తమ సమస్యలను బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు.