బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉమాభారతి నియామకం

న్యూఢిల్లీ : బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్రమంత్రి ఉమాభారతిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించిన ఆమెను పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. లోక్‌ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం యూపీలోని ఝాన్సీ లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న ఉమా భారతి, మే తరువాత ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లనున్నానని […]

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉమాభారతి నియామకం
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2019 | 8:55 AM

న్యూఢిల్లీ : బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్రమంత్రి ఉమాభారతిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించిన ఆమెను పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. లోక్‌ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఆమె ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం యూపీలోని ఝాన్సీ లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న ఉమా భారతి, మే తరువాత ఏడాదిన్నరపాటు తీర్థయాత్రలకు వెళ్లనున్నానని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వయసు రీత్యా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించడం లేదని, తన స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. దీంతో ఆమె సేవలు పార్టీకి కావాలంటూ, కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఉమా భారతికి ఉపాధ్యక్ష బాధ్యతలు బీజేపీ అప్పగించింది.