జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !

జగిత్యాల రూరల్ మండలం హైదర్ పల్లెలో గ్రామంలో కలకలం చెలరేగింది. ఓ పాడుబడ్డ ఇంటి యువతీ, యువకులు మృతదేహాలను గుర్తించిన స్థానికులు..పోలీసులకు సమాచారం అందించారు. 

జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !
Follow us

|

Updated on: Nov 16, 2020 | 12:53 PM

జగిత్యాల రూరల్ మండలం హైదర్ పల్లెలో గ్రామంలో కలకలం చెలరేగింది. ఓ పాడుబడ్డ ఇంటి యువతీ, యువకులు మృతదేహాలను గుర్తించిన స్థానికులు..పోలీసులకు సమాచారం అందించారు.  ప్రేమ జంట ఆత్యహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు  అనుమానిస్తున్నారు. స్పాట్‌లో పురుగులు మందు డబ్బా ఉండటాన్ని బట్టి…తొలుత విషం తీసుకున్న అనంతరం సదరు జంట దూలానికి ఉరి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  మృతుల్లో యువకుడు హైదర్ పల్లె గ్రామనికి చెందిన మధు అని గుర్తించగా..యువతి ఎవరు అనేది తెలియరాలేదు. పాడుబడిన ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా ఇంట్లో ఇద్దరి డెడ్‌బాడీలు కనిపించాయి.

అయితే మధు పది రోజుల నుండి కనిపించకపోవడంతో ఈ ఇద్దరూ 10 రోజుల క్రితమే సూసైడ్ చేసుకుని ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. మృతదేహాలు కుళ్ళిపోవడంతో ఉరితాడు నుంచి తల మొండెం కూడా వేరయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు వీరిద్దరూ ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారా?..లేక మరణాలు వెనుక ఇంకేమైనా కోణాలు ఉన్నాయా అని విచారిస్తున్నారు.  ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట

గుడ్ న్యూస్..తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 502 మాత్రమే

ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా