AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా..!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా..!
Balaraju Goud
|

Updated on: Jun 06, 2020 | 7:16 PM

Share

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ సమీపంలోని దండెంపల్లిలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నాడు. హైదరాబాద్ తిరిగి చేరుకున్న అతనికి కరోనా లక్షణాలు రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అతనితో కాంటాక్టులు ఎవరని తేల్చేపనిలో పడ్డారు ఆరోగ్య సిబ్బంది. ఇక యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటికి చెందిన ఓ వృద్ధుడుకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బంగారిగడ్డకు చెందిన వృద్ధుడు హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు ఇంట్లో రంజాన్ జరుపుకున్నాడు. తిరిగి చౌటుప్పల్ చేరుకున్న వృద్ధుడు.. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు కరోనా పాజిటివ్ గా తేల్చారు. దీంతో అతన్ని చికిత్స కోసం గాంధీకి తరలించారు. అతని నివాసానికి చుట్టుపక్కన ఉంటున్న 25 మందిని సెల్ఫ్ హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి మందులు కొన్న మెడికల్‌ షాప్‌ను అధికారులు మూసివేశారు.