AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికల సమర భేరికి ముందే.. బీజేపీ సన్నాహాక సమావేశాలు ప్రారంభం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే బీజేపీ సన్నాహక సమావేశాలను ప్రారంభించింది. పలువురు పార్టీ అగ్రనేతలు శనివారం పాట్నా చేరుకుని జేడీ-ఎస్ అధినేత సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా..

బీహార్ ఎన్నికల సమర భేరికి ముందే.. బీజేపీ సన్నాహాక సమావేశాలు ప్రారంభం
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 1:52 PM

Share

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే బీజేపీ సన్నాహక సమావేశాలను ప్రారంభించింది. పలువురు పార్టీ అగ్రనేతలు శనివారం పాట్నా చేరుకుని జేడీ-ఎస్ అధినేత సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ప్రభృతులు నితీష్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సీట్ల పంపిణీపై చర్చలు మొదలుపెట్టారు.  ఫిఫ్టీ-ఫిఫ్టీ మేర సీట్ల ఫార్ములాను తాము కోరుతున్నామని కమలనాథులు కోరుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ-జెడి-ఎస్ కూటమి విజయం తథ్యం కావాలని తాము కోరుతున్నామని,  ఇప్పటినుంచే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తున్నామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అప్పుడే ప్రధాని మోదీ ఈ రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

,