Attack On Mamata Banerjee:మమతపై దాడి, తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వాయిదా
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై దాడి ఘటనతో ఈ పార్టీ మేనిఫెస్టో విడుదలను వాయిదా వేశారు. ఈ మేనిఫెస్టోను గురువారం కాళీఘాట్ లో మమత విడుదల చేయాల్సి ఉంది.
Attack On Mamata Banerjee:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై దాడి ఘటనతో ఈ పార్టీ మేనిఫెస్టో విడుదలను వాయిదా వేశారు. ఈ మేనిఫెస్టోను గురువారం కాళీఘాట్ లో మమత విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు కాళీఘాట్ లో సన్నాహాలు కూడా చేశారు. అయితే మమత ఆసుపత్రి పాలు కావడంతో.. ఆమె కోలుకున్న అనంతరం ఈ దీనిని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇలా ఉండగా మొదటి దశలో 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం 206 నామినేషన్ పత్రాలు చెల్లుబాటు అయ్యాయని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ప్రకటించారు. తొలి విడతకుగాను 222 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన చెప్పారు. బీజేపీ కి చెందిన ఓ అభ్యర్థి. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. బెంగాల్ ముఖ్యమంత్రే గాయపడడంతో రాష్ట్రంలో పాలక తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డాయి. ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాల్లో తలమునకలు కావాల్సిన తాము చతికిలపడిపోయినట్టు ఈ శ్రేణులు భావిస్తున్నాయి. దీదీ ఎప్పుడు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారో, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారో తెలియని పరిస్థితి అని ఓ టీఎంసీ నేత వ్యాఖ్యానించారు.
మరో వైపు బీజేపీ బెంగాల్ లో పాగా వేసేందుకు మొత్తం 40 మంది స్టార్ కాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీతో బాటు హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇంకా కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ వంటి నేతలతో బాటు మిథున్ చక్రవర్తి, లాకెట్ ఛటర్జీ వంటి సినీ, టీవీ నటులను కూడా ఈ లిస్టులో పేర్కొన్నారు. ఇక నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :