బ్రేకింగ్ న్యూస్: తిరుపతి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలిన బాంబు…తీవ్రంగా గాయపడిన మహిళ

చిత్తూరుజిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా కలకలం రేగింది. రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది...

బ్రేకింగ్ న్యూస్: తిరుపతి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలిన బాంబు...తీవ్రంగా గాయపడిన మహిళ
Follow us

|

Updated on: Dec 08, 2020 | 5:56 PM

చిత్తూరుజిల్లా రేణిగుంట దగ్గర రైల్వే ట్రాక్ పై కలకలం రేగింది. రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేళ్లు సహా కుడిచేయి భాగం అంతా తూట్లుపడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఒక డబ్బా పేలి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మహిళ చెబుతోంది. హుటాహుటీన పేలుడు ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడ్డ బాధితురాల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని కాసేపు నిలుపుదల చేశారు.