కరణ్ జోహార్ నిర్మాత.. ‘తలా’ బాలీవుడ్ రీ-ఎంట్రీ ఖరారు..
తమిళ స్టార్ హీరో, తలా అజిత్ కుమార్ బాలీవుడ్ రీ-ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ‘బిల్లా’, ‘ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు విష్ణువర్ధన్ ప్రస్తుతం హిందీలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యువ కధానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. ఈ మూవీ కార్గిల్ వార్ నేపధ్యంలో తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అజిత్ కుమార్ను […]
తమిళ స్టార్ హీరో, తలా అజిత్ కుమార్ బాలీవుడ్ రీ-ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ‘బిల్లా’, ‘ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు విష్ణువర్ధన్ ప్రస్తుతం హిందీలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యువ కధానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. ఈ మూవీ కార్గిల్ వార్ నేపధ్యంలో తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అజిత్ కుమార్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. ఆ పాత్ర నచ్చి తలా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో అజిత్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, అజిత్ కుమార్ ప్రస్తుతం వాలిమై చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు.
Also Read:
‘రంజాన్’ వరకు లాక్డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..
అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!
ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను: కుల్దీప్
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ నాలుగో స్థానం..