ఉద్యోగులను తొలగించొద్దు.. కేటీఆర్ విన్నపం..
కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే దీన్ని అధిగమించేందుకు పలువురు ఉద్యోగులను తొలగించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలకు లేఖ రాశారు. మానవతా దృక్పథంతో అలోచించి ఒక్క ఉద్యోగిని కూడా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని ఆయా కంపెనీలను విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ అనంతరం ఐటీ […]
కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే దీన్ని అధిగమించేందుకు పలువురు ఉద్యోగులను తొలగించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలకు లేఖ రాశారు. మానవతా దృక్పథంతో అలోచించి ఒక్క ఉద్యోగిని కూడా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని ఆయా కంపెనీలను విజ్ఞప్తి చేశారు.
లాక్ డౌన్ అనంతరం ఐటీ పరిశ్రమ పుంజుకుంటుందని.. అన్ని కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 43 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 809కి చేరింది. దీనిలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
On behalf of Telangana Government, Minister @KTRTRS appealed to IT and Industry heads to ensure that no employee – regular, contract or outsourced, lose their job during this crisis. pic.twitter.com/N4E8iDVEpm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 18, 2020
Also Read:
‘రంజాన్’ వరకు లాక్డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..
అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!
ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను: కుల్దీప్