కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ నాలుగో స్థానం..

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకుగానూ ఏపీ సర్కార్ 331 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16,555 పరీక్షలు చేపట్టింది. మరోవైపు ఈ కరోనా పరీక్షలు నిర్వహించే జాబితాలో రాజస్తాన్(549) తొలిస్థానంలో నిలవగా.. కేరళ (485), మహారాష్ట్ర (446)లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో […]

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ నాలుగో స్థానం..
Follow us

|

Updated on: Apr 18, 2020 | 8:13 PM

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకుగానూ ఏపీ సర్కార్ 331 కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16,555 పరీక్షలు చేపట్టింది.

మరోవైపు ఈ కరోనా పరీక్షలు నిర్వహించే జాబితాలో రాజస్తాన్(549) తొలిస్థానంలో నిలవగా.. కేరళ (485), మహారాష్ట్ర (446)లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో కరోనా టెస్టుల సామర్ధ్యాన్ని భారీ స్థాయికి పెంచారు. రోజుకు 90 టెస్టుల స్థాయి నుంచి 3 వేలకు పైగా టెస్టులు చేసేలా సామర్ధ్యాన్ని పెంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కి చేరింది.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!

ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను: కుల్దీప్

Latest Articles