Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 518 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 44,869 కరోనా పరీక్షలు చేయగా.. 518 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,074కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 44,869 కరోనా పరీక్షలు చేయగా.. 518 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,074కి చేరింది. గురువారం కరోనాతో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,527కి చేరింది. కరోనాబారి నుంచి గురువారం 491 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,75,708కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,839 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. వీరిలో 4,723 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 66,55,987కి చేరింది.

Also Read :
Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్
Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది
Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ




