భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
మాంత్రికుల దొంగబుద్ధులను, వారు చేసే ఆరాచకాలను వెలుగులోకి తెచ్చి అలాంటివారి పట్ల దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నా ఇంకా కొందరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. మోసపోతున్నారు.. మహారాష్ట్రలోని నండూర్బర్ జిల్లాలో ఇలాగే ఓ దుష్ట మాంత్రికుడు దయ్యం పేరు చెప్పి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశాడు.. ఆ మాంత్రికుడితో పాటు అతడి ఇద్దరు అనుచరులు కూడా అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు..అసలేం జరిగిందంటే.. నండూర్బర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూతుళ్ల ఆరోగ్యం బాగుండటం లేదంటూ విష్ణునాయక్ అనే మాంత్రికుడి […]
మాంత్రికుల దొంగబుద్ధులను, వారు చేసే ఆరాచకాలను వెలుగులోకి తెచ్చి అలాంటివారి పట్ల దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నా ఇంకా కొందరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. మోసపోతున్నారు.. మహారాష్ట్రలోని నండూర్బర్ జిల్లాలో ఇలాగే ఓ దుష్ట మాంత్రికుడు దయ్యం పేరు చెప్పి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశాడు.. ఆ మాంత్రికుడితో పాటు అతడి ఇద్దరు అనుచరులు కూడా అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు..అసలేం జరిగిందంటే.. నండూర్బర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూతుళ్ల ఆరోగ్యం బాగుండటం లేదంటూ విష్ణునాయక్ అనే మాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు.. మాంత్రికులందరూ చెప్పినట్టుగానే విష్ణునాయక్ కూడా దయ్యం పట్టిందన్నాడు.. కూతుళ్లను కొన్నాళ్ల పాటు తన దగ్గర వదిలివెళితే దయ్యాలను వదిలిస్తానన్నాడు.. మాంత్రికుడిని నమ్మేసిన అతడు కూతుళ్లను అక్కడ వదిలిపెట్టి వెళ్లాడు.. ఇదే అదనుగా విష్ణుకుమార్ భూతవైద్యం పేరు చెప్పి బాలికలపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. అతడి అనుచరులు కూడా అఘాయిత్యానికి ఒడిగట్టారు. అయితే ఈ విషయాన్ని బాలికలు భయంతో ఇంట్లో చెప్పుకోలేకపోయారు. ఇటీవల వారిలో ఒక బాలిక గర్భందాల్చడంతో జరిగిన ఘోరం వెలుగు చూసింది.. దీంతో బాలికల తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు.. ముగ్గురూ దక్షిణ గుజరాత్లోని నౌసారి జిల్లాలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికెళ్లి వారిని అరెస్ట్ చేశారు.