AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య కేసులో కీలక మలుపు.. రివ్యూ పిటిషన్ వేయం.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇఛ్చిన నేపథ్యంలో తాము దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఈ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ స్పష్టం చేస్తూ.. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తీర్పును కూలంకషంగా అధ్యయనం చేస్తామని, అనంతరం తమ బోర్డు వివరణాత్మక స్టేట్ మెంట్ ఇస్తుందని ఆయన అన్నారు. ఏ లాయరైనా, వ్యక్తి అయినా బోర్డు ఈ తీర్పును సవాల్ చేస్తుందని […]

అయోధ్య కేసులో కీలక మలుపు.. రివ్యూ పిటిషన్ వేయం.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన ప్రకటన
Anil kumar poka
|

Updated on: Nov 09, 2019 | 5:50 PM

Share

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇఛ్చిన నేపథ్యంలో తాము దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఈ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ స్పష్టం చేస్తూ.. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తీర్పును కూలంకషంగా అధ్యయనం చేస్తామని, అనంతరం తమ బోర్డు వివరణాత్మక స్టేట్ మెంట్ ఇస్తుందని ఆయన అన్నారు. ఏ లాయరైనా, వ్యక్తి అయినా బోర్డు ఈ తీర్పును సవాల్ చేస్తుందని చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. రివ్యూ పిటిషనే కాదు.. క్యురేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేయబోమన్నారు. . దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాగా-కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని అంతకుముందు బోర్డు తరఫు లాయర్ జఫర్యాబ్ జిలానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.