AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకున్న విద్యార్థి

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికి విలవిలలాడుతున్నారు. కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 5వ తరగతి విద్యార్థిని కలచివేసింది. తమ చదువులు చెప్పిన టీచర్లను ఆదుకోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రికి చెప్పి వారికి నిత్యావసర సరుకులు అందించేలా చేశాడు.

ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకున్న విద్యార్థి
Balaraju Goud
|

Updated on: Aug 10, 2020 | 4:17 PM

Share

కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కటేమిటి అన్ని వర్గాలపై కొవిడ్‌-19 తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ప్రతి వ్యక్తి జీవన శైలినే మార్చివేసింది. కరోనా రాకాసి బతుకు చిత్రాన్నే మార్చేసింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికి విలవిలలాడుతున్నారు. కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 5వ తరగతి విద్యార్థిని కలచివేసింది. తమ చదువులు చెప్పిన టీచర్లను ఆదుకోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రికి చెప్పి వారికి నిత్యావసర సరుకులు అందించేలా చేశాడు.

నల్లగొండ జిల్లా హాలియాలోని అక్షయ హై స్కూల్ లాక్ డౌన్ కారణంగా మూతపడింది. దీంతో ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాల యాజమాన్యం ఆదాయం లేక సరిగా జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎక్కలూరి సాయి సాత్విక్ రెడ్డికి విషయం తెలిసింది. ఉపాధ్యాయులకు ఎంతో కొంత సాయం అందించాలనుకున్నాడు. దీంతో తన తండ్రి హాలియా మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డికి వివరించాడు. దీంతో కొడుకు ఆలోచనను మెచ్చకున్న శ్రీనివాస్ రెడ్డి ఇందుకు అంగీకరించాడు. పాఠశాలలోని 21 మంది ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల రైస్, కిరాణా సామాగ్రి, శానిటైజర్ తో పాటు మాస్కులు అందించారు.

నేటికీ పాఠశాలలు పునఃప్రారంభం కానందున ప్రైవేట్ టీచర్స్ మనుగడను దృష్టిలో ఉంచుకొని తన కుమారుని కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాస్ రెడ్డి. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలోని ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీచర్స్ ను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.

Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత