తాను నిర్మిస్తున్న ‘బేతాళ్’ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’ని ప్రకటించారు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్. ఇందులో విజేతలుగా నిలిచిన వారితో తాను వీడియో కాల్ మాట్లాడతానని వెల్లడించారు. ‘బేతాళ్’ సినిమాని హర్రర్ కథతో తెరకెక్కించారు. ఈ నెల 24న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. లాక్డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ను వినూత్నంగా చేస్తున్నారు షారుక్. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్ పోటీని ప్రకటించారు. హర్రర్ కథాంశంతో ఓ షార్ట్ ఫిల్మ్ను చిత్రీకరించి తనకు పంపాలని ట్వీట్లో చేశారు షారుఖ్.
అలాగే ‘తనకు పంపిన వాటిల్లో మూడు షార్ట్ ఫిల్మ్ని ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తామని షారుక్ పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. కేవలం ఇంట్లో మాత్రమే దీనిని చిత్రీకరించాలని అన్నారు. అందులో నటించే వారు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మే 18లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తమకు పంపాలని వెల్లడించారు షారుక్’. కాగా ఇప్పటికే వచ్చిన బేతాళ్ ట్రైలర్ భయపెట్టే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.
Since we’ve all got a bit of time on our hands in quarantine, thought I can get us all to work a bit… in a fun, creative and… spooky way! #SpookSRK
Read on for more details. pic.twitter.com/MNh8Osq3ND— Shah Rukh Khan (@iamsrk) May 9, 2020
Read More: