రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్‌తో పాటే మీల్స్ కూడా..!

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రైల్వే ప్రయాణికుల కోసం మీల్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త కేటరింగ్ పాలసీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ స్టాండర్డ్ నుంచి డీలక్స్ వరకూ మల్టిపుల్ మీల్ ఆప్షన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా వారికి ఆహారం అందించడమే ఐఆర్‌సీటీసీ కేటరింగ్ పాలసీ ముఖ్య ఉద్దేశమని రైల్వే బోర్డు చైర్మన్ వీకే […]

రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్‌తో పాటే మీల్స్ కూడా..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 8:15 AM

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రైల్వే ప్రయాణికుల కోసం మీల్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త కేటరింగ్ పాలసీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ స్టాండర్డ్ నుంచి డీలక్స్ వరకూ మల్టిపుల్ మీల్ ఆప్షన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ప్రయాణికుల బడ్జెట్‌కు అనుగుణంగా వారికి ఆహారం అందించడమే ఐఆర్‌సీటీసీ కేటరింగ్ పాలసీ ముఖ్య ఉద్దేశమని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఇక ప్రయాణికులకు ఒక మెను అందుబాటులో ఉంటుందని.. వారికి నచ్చిన ఐటమ్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. అయితే ఫుడ్‌ని బట్టి రేటు కూడా ఉంటుందని చెప్పారు.