అనిల్ కపూర్ నట వారసురాలు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ లండన్ చెక్కేసింది. ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతున్న సమయంలో ఈ బాలీవుడ్ ముంబైని వదిలి లండన్ కు చేరింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లండన్ ఐ యమ్ బ్యాక్ అంటూ మెసెజ్ పెట్టింది.
మార్చిలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించకముందే భర్త పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజాతో కలిసి సోనమ్ ఢిల్లీ చేరుకుంది. అనంతరం జూన్ 9న సోనమ్ పుట్టిన రోజుకు ఒకరోజు ముందు ఈ దంపతులు ముంబయికి వచ్చారు. అదే సమయంలో లాక్డౌన్తో పాటు అన్ని ప్రయాణాలపై నిషేధంతో నగరంలోనే ఉండాల్సి వచ్చింది. సొంత ఇళ్లు, బంధువులు అక్కడే ఉండటం వల్ల లండన్ కు వెళ్లిపోయింది.