బాబ్రీ కేసు తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ, సుప్రీంకోర్టు
బాబ్రీ కేసులో తీర్పు చెప్పిన స్పెషల్ కోర్టు మాజీ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి భద్రతను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ
బాబ్రీ కేసులో తీర్పు చెప్పిన స్పెషల్ కోర్టు మాజీ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి భద్రతను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెడుతూ గత సెప్టెంబరు 30 న ఈ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. మాజీ జడ్జి యాదవ్ గత ఏడాది రిటైర్ కావలసి ఉంది. అయితే 28 ఏళ్ళ నాటి బాబ్రీ కేసును విచారించేందుకు ఆయన పదవీకాలాన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసు అత్యంత కీలకమైనది గనుక తనకు సెక్యూరిటీని పొడిగించాలని యాదవ్ కోరారని, కానీ ఆ అవసరం లేదని భావించామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.