రిలయన్స్ జియో నయా రికార్డ్
ముంబయి: జియో…టెలికాం రంగంలో ఉహించని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ సంస్థ మరింత వృద్ది దిశగా ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా రిలయన్స్ జియో.. నయా రికార్డును నెలకొల్పింది. రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 30 కోట్ల మార్కును దాటడమే దీనికి కారణం. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే జియో ఈ ఘనతను సొంతం చేసుకుంది. అంతకుముందు టెలికాం సేవలను ప్రారంభించిన జియో కేవలం 175 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి […]
ముంబయి: జియో…టెలికాం రంగంలో ఉహించని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ సంస్థ మరింత వృద్ది దిశగా ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా రిలయన్స్ జియో.. నయా రికార్డును నెలకొల్పింది. రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 30 కోట్ల మార్కును దాటడమే దీనికి కారణం. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే జియో ఈ ఘనతను సొంతం చేసుకుంది. అంతకుముందు టెలికాం సేవలను ప్రారంభించిన జియో కేవలం 175 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కష్టమర్లకు అత్యంత వేగవంతమైన నెట్వర్క్ను అందించిడం..ఆకట్టుకునే ప్లాన్స్, సేవల పరంగా కష్టమర్ ప్రెండ్లీగా ఉండటంతో ప్రజలు జియో పట్ల ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం టెలికాం కంపెనీయైన భారతీ ఎయిర్టెల్కు 34 కోట్ల మంది వినియోగదారులుండగా.. 40 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్ – ఐడియా అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ పరంగా చూస్తే..మరో 2, 3 ఏళ్లలోనే జియో నెట్వర్క్ మరిన్ని సంచలనాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.