AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌కు పరోక్ష హెచ్చరికలు చేసిన రాజ్‌నాథ్ సింగ్

ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత్ ఎప్పుడూ ముందుండదని.. కానీ భవిష్యత్‌లో తన నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోందని.. ఇప్పటికీ ఆ విషయానికి కట్టుబడి ఉందని.. కానీ భవిష్యత్‌లో పరిస్థితులను […]

పాక్‌కు పరోక్ష హెచ్చరికలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 16, 2019 | 9:17 PM

Share

ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత్ ఎప్పుడూ ముందుండదని.. కానీ భవిష్యత్‌లో తన నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోందని.. ఇప్పటికీ ఆ విషయానికి కట్టుబడి ఉందని.. కానీ భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి మన నిర్ణయం మారొచ్చని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌లోనూ పేర్కొన్నారు. కాగా ఈ ప్రకటనతో భారత్ పాకిస్తాన్‌ను పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కాగా జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్, పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమంటూ పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ విషయంలో చైనా, ఐక్యరాజ్యసమతి జోక్యాన్ని కోరుతూ పాక్ లేఖ రాసింది. ఈ క్రమంలో చైనా మధ్యవర్తిత్వం మేరకు నేడు ఐరాస రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.