AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో 300మంది ఎంపీలకు తెలుగోడి విందు.. అసలు కథేంటి..?

రాజుగారు హౌ ఆర్‌ యూ..? అన్న ప్రధాని పిలుపుతో.. ఆ ఎంపీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ.. వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును.. పేరు పెట్టి రాజుగారూ హౌ ఆర్ యూ అంటూ పలకరించారు. అయితే ప్రధాని ఆ  పిలుపుతో.. ఎంపీగారి జోరు.. ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇంటి నుంచి మొదలుపెడితే.. సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ ఎంపీ […]

ఢిల్లీలో 300మంది ఎంపీలకు తెలుగోడి విందు.. అసలు కథేంటి..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 10, 2019 | 9:55 PM

Share

రాజుగారు హౌ ఆర్‌ యూ..? అన్న ప్రధాని పిలుపుతో.. ఆ ఎంపీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ.. వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును.. పేరు పెట్టి రాజుగారూ హౌ ఆర్ యూ అంటూ పలకరించారు. అయితే ప్రధాని ఆ  పిలుపుతో.. ఎంపీగారి జోరు.. ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇంటి నుంచి మొదలుపెడితే.. సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ ఎంపీ హవానే.. అయితే తాజాగా మళ్లీ మరో వార్తతో వార్తల్లోకెక్కాడు. దాదాపు మూడు వేల మంది వీఐపీలకు ఢిల్లీలో విందు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిన్నర్‌కి ప్రముఖ రాజకీయ నాయకులతో పాటుగా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు హాజరుకానున్నట్లు.. సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ విందు వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మూడువేల మంది వీఐపీలకు డిన్నర్ ఇస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాతో పాటు.. పలు మీడియాల్లో కూడా ప్రత్యేక కథనాలు రావడంతో.. ఎట్టకేలకు ఆయన దీనిపై స్పందించారు. మూడు వేల మంది అనేది వట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. బుధవారం రోజు రాత్రి.. 300మంది ఎంపీలకు విందు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ డిన్నర్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా, స్పీకర్‌లను సెక్యూరిటీకి ఇబ్బందిగా అవుతుందని వారిని ఆహ్వానించలేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే.. ఈ విందుకు భారీ మెనుతో రఘురామకృష్ణంరాజు అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డిన్నర్‌లో ప్రత్యేకంగా ఆంధ్ర వంటకాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజుగారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విందులో ఇచ్చే కిళ్లీపై అనేక వార్తలు వస్తున్నాయి. ఒక్కో కిళ్లీ ధర.. రూ.1000/- ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఒక్క కిళ్లీకే ఇంత ఖర్చు పెడుతున్నారంటే.. మిగతా వంటకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చంటు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంత రేంజ్‌లో అసలు రాజుగారు డిన్నర్ ఎందుకు ఇస్తున్నారన్న దానిపై భిన్న రకాల రాజకీయ స్వరాలు వినిపిస్తున్నాయి. తొలిసారి ఎంపీగా గెలిచిన ఈయన.. సీఎం జగన్ మాట వినకుండానే పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గుసగుసలు మొదలయ్యాయట. ఇక ఇలా దూకుడుగా వెళ్లడానికి అసలు రీజన్.. ఆయన వియ్యంకుడు కేవీపీ అండగా ఉండటమేనంటూ మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరికొందరైతే.. ఈ మధ్య తరచూ బీజేపీ నేతలతో టచ్ ఉంటున్నారని.. ఇక కమలం గూటికి వెళ్లడం ఖాయమన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే సీఎం జగన్‌ బీజేపీ నేత గోకరాజు గంగారాజు కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రాజుగారి డిన్నర్.. ఎమైనా రాజకీయ దుమారానికి తెరతీస్తుందో వేచి చూడాలి.

Follow Us
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ