సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. ఇదే మా నినాదం

సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయమని… ఈ ఎన్నికల్లో 61 కోట్ల […]

సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. ఇదే మా నినాదం
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 12:35 PM

సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయమని… ఈ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించారని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొగి.. తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారని ఆయన అన్నారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశమిచ్చారన్నారు. ఈ 17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారేనని.. అంతేగాక, మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. నవ భారత నిర్మాణానికి ఇదే నిదర్శనమని కోవింద్‌ అన్నారు.