AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కా ప్లాన్.. అదును చూశారు.. అంతం చేశారు..

మంగళగిరిలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ కక్షలు ప్రత్యర్థుల హత్యలకు దారితీస్తున్నాయి. గత నెలలో టీడీపీకి చెందిన ఉమా మహేశ్వరరావు యాదవ్‌ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఉమామహేశ్వరరావు ఇంటి సమీపంలోనే మట్టు బెట్టారు. కొద్ది రోజుల పాటు మర్డర్ పై ఇటు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మర్డర్ కు పాల్పడిన 12 మంది నిందితులను […]

పక్కా ప్లాన్.. అదును చూశారు.. అంతం చేశారు..
TV9 Telugu Digital Desk
| Edited By: Nikhil|

Updated on: Jul 13, 2019 | 4:33 PM

Share

మంగళగిరిలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ కక్షలు ప్రత్యర్థుల హత్యలకు దారితీస్తున్నాయి. గత నెలలో టీడీపీకి చెందిన ఉమా మహేశ్వరరావు యాదవ్‌ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. ఉమామహేశ్వరరావు ఇంటి సమీపంలోనే మట్టు బెట్టారు. కొద్ది రోజుల పాటు మర్డర్ పై ఇటు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మర్డర్ కు పాల్పడిన 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇందులో 11 మంది టీడీపీకి చెందినవారే ఉన్నారు. దీంతో హత్యపై పలు అనుమానాలను టీడీపీ వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆదిపత్య పోరులో సొంత పార్టీకి చెందిన నేతలే మర్డర్ చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మర్డర్ కేసులో ఐదుగురు వ్యక్తులు తామే హత్యచేశామని లొంగిపోయినా.. రాజకీయ కుట్రతోనే మర్డర్ తో సంబంధం లేని వ్యక్తులను ఇరికించారని టీడీపీ మండిపడుతోంది. మొత్తానికి మంగళగిరిలో ఉమా మహేశ్వరరావు హత్యపై ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.