AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో భారీ నిరసనలు

Panjab University PhD Scholor Death: చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో వర్షపు నీటిలో విద్యుత్ ప్రవహించడంతో పీహెచ్‌డీ విద్యార్థిని జ్యోతి మృతి చెందింది. ఈ ఘటనపై విద్యార్థులు భారీ నిరసన చేపట్టగా, యూనివర్సిటీ రూ.16 లక్షల ఆర్థిక సాయం, ఆమె సోదరుడికి ఉద్యోగాన్ని ప్రకటించింది.

పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో భారీ నిరసనలు
Panjab University Phd Schol
Rajashekher G
|

Updated on: Jul 29, 2026 | 2:20 PM

Share

చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్షపు నీటిలో ప్రవహించిన విద్యుత్ కారణంగా పీహెచ్‌డీ విద్యార్థిని మృతి చెందడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో హర్యానాలోని రేవారీ జిల్లాకు చెందిన జ్యోతి అనే పరిశోధకురాలు (పీహెచ్‌డీ విద్యార్థిని) మృతి చెందింది. ఆమె పంజాబ్ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నది. హాస్టల్ నుంచి తన విభాగానికి వెళ్తున్న సమయంలో వర్షం కారణంగా దారి మొత్తం నీటితో నిండిపోవడంతో ఆమె పక్కనే ఉన్న మట్టి దారిలో వెళ్లింది.

అయితే, ఆ మార్గం సమీపంలోని విద్యుత్ జంక్షన్ బాక్స్ నుంచి లీకైన విద్యుత్ ప్రవాహం నీటిలోకి చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ నీటిలో అడుగుపెట్టగానే జ్యోతికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె మృతిచెందినట్లు ప్రకటించారు.

ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రేణు విగ్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. క్యాంపస్‌లో విద్యుత్ భద్రత, నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జ్యోతి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో జ్యోతి కుటుంబ సభ్యులతో యూనివర్సిటీ అధికారులు సమావేశమయ్యారు. అనంతరం జ్యోతి కుటుంబానికి రూ.16 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఆమె సోదరుడికి పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించారు. జ్యోతి సోదరుడు 10+2 విద్యతో పాటు ఎలక్ట్రికల్ ఐటీఐ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

జ్యోతి తండ్రి రైతుగా పనిచేస్తూనే ఒక ప్రైవేట్ పాఠశాలలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి గృహిణి. జ్యోతి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, విద్యుత్ భద్రతా లోపాలపై విచారణ కొనసాగుతోంది.

చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జ్యోతి మృతి హృదయ విదారకమని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధ్యతను నిర్ధారించాలని చండీగఢ్ పరిపాలనతో పాటు పంజాబ్ యూనివర్సిటీ అధికారులను కోరారు. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Follow Us
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఇండియా గుడ్డు రూ.9.. పాక్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఇండియా గుడ్డు రూ.9.. పాక్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా?ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం
ఉప్పుతో ఇన్ని ఉపయోగాలా?ఇంతకాలం తెలియక వంటకాల్లో రుచికే అనుకున్నాం
ప్రతి రోజూ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా? ఇది ఆరోగ్యానికి మంచిదేానా
ప్రతి రోజూ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా? ఇది ఆరోగ్యానికి మంచిదేానా
అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు!
అబ్బ.. ఈ పాము ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెట్టు!