AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్..? కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎమ్ఆర్!

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వాడకంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) కీలక సూచన

కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్..? కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎమ్ఆర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2020 | 6:05 PM

Share

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వాడకంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) కీలక సూచన చేసింది. ఈ మందుపై జరుగుతున్న అధ్యయనం తాలూకు ఫలితాలు వచ్చే వరకూ కరోనా రోగులకు ఈ ఔషధం ఇవ్వక్కర్లేదని సూచించింది. ‘మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కచ్చితంగా వాడలని ఎవరూ చెప్పలేదు. ఈ మందు ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందా లేదా అనేది ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనంలో తెలుస్తుంది. డాక్టర్లు దీన్ని ప్రస్తుతం కరోనా రోగ లక్షణాలు ఉన్న పేషెంట్లపై పరీక్షించి చూస్తున్నారు.

కాగా.. ఆశావాహ ఫలితాలు వచ్చే వరకూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనా రోగులకు ఇవ్వాలని మేము సూచించలేము’ అని ఐసీఎమ్ఆర్ శాస్త్రవేత్త గంగా కేట్కర్ తెలిపారు. అంతే కాకుండా.. కరోనా మహమ్మారికి సంబంధించిన భారత్ మూడో స్టేజీకి చేరుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. ఇక.. కరోనా పనిపట్టే మందు కోసం వెతుకున్న ప్రయత్నాల ఫలితంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావశీలతపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నప్పటీ అమెరికా, బ్రెజిల్ సహా అనేక దేశాలు దీనితో కరోనాను కట్టడి చేయచ్చని భావిస్తున్నాయి.