AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కలవరపెడుతున్న కొత్త వైరస్… ల్యాబ్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్న అధికారులు..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ కలవరపెడుతోంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 1,187మంది ఆచూకీని గుర్తించిన అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

ఏపీలో కలవరపెడుతున్న కొత్త వైరస్... ల్యాబ్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్న అధికారులు..
Balaraju Goud
|

Updated on: Dec 28, 2020 | 6:59 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ కలవరపెడుతోంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 1,187మంది ఆచూకీని గుర్తించిన అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే, కాంటాక్ట్ ట్రెసింగ్‌లో మరో 29 మంది జాడ తెలియాల్సి ఉంది. అందులో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. వీరినుంచి మరోసారి నమూనాలు తీసుకుని పుణె, బెంగళూరు ల్యాబ్‌లకు పంపించామన్నారు. ఈ ఆరుగురిలో గుంటూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

కాగా, యూకే నుంచి తిరిగి వచ్చిన వారితో కాంటాక్టులుగా 3,282 మందిని గుర్తించిన అధికారులు.. వారిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అయితే వీరిలో నలుగురికీ పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ముగ్గురు గుంటూరులో, ఒకరు నెల్లూరులో ఉన్నారు. మొత్తంగా కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలో పదిమంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. అయితే, లండన్‌ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కనిపిస్తున్న లక్షణాలు కొత్త రకానివేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ ముగ్గురికి ఇవే లక్షణాలు కనిపించాయి. ఇదిలావుంటే, వీరందరికీ కొత్త స్ట్రెయిన్‌ వైరస్ వ్యాప్తించా అన్న దానిపై రిపోర్టులు అందాక నిర్ధారిస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి