AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా చెలిమితో నేపాల్ ఓవ‌రాక్ష‌న్..తాజాగా భారత్​తో మ‌రో వివాదం..!

ఇన్నాళ్లు మ‌న‌తో మిత్ర‌దేశంగా మెలిగిన నేపాల్..ఇప్పుడు చైనా అండ‌తో ఇండియాతో క‌య్యానికి కాలు దువ్వ‌తోంది. ఇటీవ‌ల భార‌త త‌మవిగా చెప్తోన్న భూభాగాల‌ను కూడా త‌మ‌వే అంటూ నూత‌న మ్యాప్ రీలీజ్ చేసిన ఆ దేశం.. తాజాగా మ‌రో వివాదం రాజుకునేలా చేసింది.

చైనా చెలిమితో నేపాల్ ఓవ‌రాక్ష‌న్..తాజాగా భారత్​తో మ‌రో వివాదం..!
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2020 | 10:31 PM

Share

ఇన్నాళ్లు మ‌న‌తో మిత్ర‌దేశంగా మెలిగిన నేపాల్..ఇప్పుడు చైనా అండ‌తో ఇండియాతో క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇటీవ‌ల భార‌త త‌మవిగా చెప్తోన్న భూభాగాల‌ను కూడా త‌మ‌వే అంటూ నూత‌న మ్యాప్ రీలీజ్ చేసిన ఆ దేశం.. తాజాగా మ‌రో వివాదం రాజుకునేలా చేసింది. బిహార్​లోని పంతోక గ్రామానికి ద‌గ్గ‌ర్లో ఉన్న బార్డ‌ర్ వద్ద ఓ వాచ్​ టవర్​ను నిర్మించింది నేపాల్​. ఇది నేపాల్​ ద‌ళాల‌ గస్తీకి ఉపయోగపడనుంది. అయితే ఈ వాచ్​ టవర్​ వివాదానికి చైనా పరోక్ష కారణమని స‌మాచారం.

వాచ్​ టవర్​ను ఏర్పాటు చేయడానికి నేపాల్​పై చైనా ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. భారత్​ వ్యవహారాలపై ఫోక‌స్ పెట్టడానికే నేపాల్​ను చైనా ఈ విధంగా ప్రోత్సహించి ఉండొచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. పోల్ నెం 392/13- స్తంభం నెం 392/18 మధ్య ఈ టవర్​ను నిర్మించింది నేపాల్​. అయితే బార్డ‌ర్ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన రెండు స్తంభాల మధ్య ఉండాల్సిన ఓ చిన్న స్తంభం కనపడటం లేదని సశస్త్ర సీమా బల్ ఆఫీస‌ర్స్ పేర్కొన్నారు. మరోవైపు నేపాల్​ చర్యలపై బీహార్​ ప్రభుత్వం గుర్రుగా ఉంది. గండక్ బ్యారేజీపై మరమ్మతు పనులను నేపాల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్డుకోవటంపై ఇప్పటికే ఆగ్రహం వ్య‌క్తం చేశారు బిహార్ సీఎం నితిశ్​ కుమార్​. ఈ బ్యారేజీ వల్ల బిహార్, యూపీల‌తో పాటు నేపాల్​లోని టెరాయ్​ ప్రాంతాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇరు దేశాలు కలిసి బ్యారేజీ 18 గేట్లను పంచుకున్నాయి.